కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన నిత్య... హిట్ కాంబో రిపీట్ అంటున్న నెటిజన్లు..!

lakhmi saranya
నిత్య మీనన్ ఎన్నో సినిమాల్లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. నిత్య మీనన్ మొట్టమొదటిగా ఇండస్ట్రీలోకి మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అనే సినిమాతో పరిచయం అయింది. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇష్క్ అనే మూవీలో నితిన్ సరసన హీరోయిన్ గా నటించింది. ఒక్క సినిమా హిట్ అయింది అంటే.. అందులో హీరో, హీరోయిన్లు పాత్ర సమానంగా ఉంటుంది. దీంతో మరోసారి ఆ జంట జతకడితే సినిమాపై వేరే లెవర్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొంటాయి. అలాంటి రోహిత్ కాంబోనే ఇప్పుడు మరోసారి రిపీట్ అవుతోంది.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, క్యూట్ బ్యూటీ నిత్య మీనన్ జంటగా నటించిన చిత్రం 'తిరుచిత్రాంబళం'. డైరెక్టర్ మిత్రన్ ఆర్. జవహర్ తర్కెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఆదరణ దక్కడంతో సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా... ఈ సినిమాలోని తన నటనకు గానూ ఇటీవలే ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సైతం అందుకుంది నిత్య మీనన్. ఇదిలా ఉంటే... తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్య.. తన కొత్త సినిమాపై అనౌన్స్మెంట్ ఇచ్చింది. ' దీన్ని గురించి నేను ఇప్పుడే అధికారం గా ప్రకటించలేను. కానీ... గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న మూవీ ఇది. 'చిరుచిత్రాంబళం' లోని శోభిత పాత్ర మాదిరిగానే... ఇందులో నా పాత్ర చాలా కొత్తగా, సవాలుగా ఉంటుంది.
 ఈ సినిమాలో భాగమైనందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ నిత్య మీనన్ కామెంట్స్ వైరల్ అవుతుంటే.. 'తిరు' చిత్రంలోతన క్యారెక్టర్ గురించి ప్రస్తావించటంతో.. మరోసారి ధనుష్ తో మూవీ చేస్తుందని అనుకుంటూ.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు నేటిజన్లు అంతే కాకుండా సూపర్ కాంబో మరోసారి రిపీట్ కాబోతున్నట్లు వార్తలు రావటంతో... అఫిషియల్ అనౌన్స్మెంట్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుంది అని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: