తన 52వ చిత్రాన్ని అనౌన్స్ చేసిన స్టార్ హీరో... ఆనందంలో ఫ్యాన్స్..!

lakhmi saranya
తమిళ్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ధనుష్ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ధనుష్ రఘువర్ణ బీటెక్ అనే మూవీలో హీరోగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా అందుకుంది. తమిళ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవల నటించిన చిత్రం 'రాయన్'. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు,
హిందీ భాషల్లో రిలీజ్ అయి బాక్సా ఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని... కలెక్షన్లు కూడా భారీగానే రాబట్టింది. ఇక ఈ చిత్రం తర్వాత ధనుష్... మరో సినిమా 'NEEK( నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్) ' కు కూడా దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా మరోవైపు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో 'కుబేర ' సినిమాలో నటిస్తున్నాడు. ఇలా వరుస మూవీస్ తో బిజీగా ఉన్న ధనుష్... ఇప్పుడు మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది డాన్ పిక్చర్స్ బ్యానర్.
 ఈ మేరకు 'డాన్ పిక్చర్స్ బ్యానర్ లో రానున్న మా మొదటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను ప్రకటించడానికి సంతోషిస్తున్నాము. ఇది ప్రొడక్షన్ హౌస్ కి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను అలరించడానికి, ధనుష్ ఫ్యాన్స్ కు వినూత్నమైన కంటెంట్ ను రూపొందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా తొలి ప్రాజెక్ట్ ధనుష్ సర్ నటించిన 'నడిపిన్ అసురన్' "D52 " ని ప్రకటించటం గరవంగా ఉంది. ఈ ఉత్తేజకరమైన కొత్త ప్రయత్నంలో ధనుష్ మాకు సహకరించి ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మేము ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము' అని నిర్మాత ఆకాష్ బాస్కరన్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: