దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో కన్ఫ్యూజన్.. అసలు ఎప్పుడు చేస్తారు..!?

Anilkumar
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ ‘దేవర’ మేనియాతో టాలీవుడ్ ఊగిపోతుంది. ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా పది రోజులు సమయం ఉన్నప్పటికీ, అప్పుడే ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ దేవర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే దేవర ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్‌లో జరుగుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్‌లో దేవర ప్రమోషన్స్ పూర్తవగా, ఇప్పుడు తెలుగులో ఈ ప్రమోషన్స్ గ్రాండ్‌గా జరిపేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఓ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో పాటు పలు ఇంట్రెస్టింగ్

 ఇంటర్వ్యూలతో ఈ సినిమాకు సాలిడ్ బజ్ తీసుకురానున్నారు.లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని సెప్టెంబర్ 22న హైదరాబాద్ లో మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.రానున్న రోజులలో చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ కీలక పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ

 నిర్మిస్తున్న "దేవర: పార్ట్ 1" ఎపిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలుస్తుంది. ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ గ్లోబల్ లెవల్ కు పెరిగింది. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. కొమరం భీమ్ గా తారక్ నటనకు ఫిదా కానీ వారు ఎవరు లేరు. ఈ సినిమా కోసం దాదాపు రూ. 40 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న ఎన్టీఆర్.. ‘దేవర’కోసం భారీ ఎత్తున పారితోషికం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: