ప్రభాస్ ఫౌజీ సినిమా విషయంలో మారిన ప్లాన్.. హీరోయిన్ సీతనా..!?

Anilkumar
టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం బిజీగా ఉన్న హీరో అంటే పాన్ ఇండియా స్టార్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఏడాదికి రెండు సినిమాల‌ను విడుద‌ల చేస్తున్నాడు ఈ స్టార్ హీరో. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేతిలో స‌లార్ 2తో పాటు క‌ల్కి పార్ట్, రాజా సాబ్, స్పిరిట్ చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేయ‌డానికి క‌నీసం ఇంకో సంవ‌త్స‌రం అయిన ప‌డుతుంది. అయితే ఈ సినిమాల‌తో పాటు ప్ర‌భాస్ మ‌రో టాలీవుడ్ ద‌ర్శ‌కుడికి ఒకే చెప్పిన విష‌యం తెలిసిందే, పడి పడి లేచే మనసు, సీతారామం, అందాల రాక్షసి చిత్రాల ఫేమ్ హను రాఘవపూడితో ‘ఫౌజీ’ అనే మూవీ ఒకే చేశాడు ప్ర‌భాస్. ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా

 ఉండ‌గా.. ఈ సినిమా అక్టోబ‌ర్ చివ‌రి వారంలో లేదా, న‌వంబ‌ర్‌లో షూటింగ్ మొద‌లు పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తుంది. యానిమ‌ల్ ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా ప్ర‌భాస్ కాంబోలో వ‌స్తున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమాను మొద‌ట 2024 చివ‌రిలో షూటింగ్ ప్రార‌భించ‌నున్న‌ట్లు చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌క‌టించాడు. అయితే ‘స్పిరిట్’ ప్రీ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం పడుతుంద‌ని తెలుస్తుంది.  అయితే 'ఫౌజీ' మూవీలో ప్రభాస్ కి జోడీగా ఇమాన్వి ఇస్మాయిల్ అనే బ్యూటీని హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశారు. ఆమెకిదే మొదటి చిత్రం కావడం విశేషం. అయితే హను రాఘవపూడి దీనికంటే ముందు దుల్కర్, మృణాల్ కాంబినేషన్ లో 'సీతారామం' సినిమా

 చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అందుకే 'ఫౌజీ' సినిమాలో ప్రభాస్ కి జోడీగా మృణాల్ ఠాకూర్ ని కన్ఫర్మ్ చేసినట్లు ప్రచారం జరిగింది. తరువాత ఈ ప్రచారానికి మేకర్స్ ఫుల్ స్టాప్ పెట్టారు.  ఇప్పుడు ప్రభాస్ కి జోడీగా 'మృణాల్ ఠాకూర్' పేరు మరోసారి తెరపైకి వచ్చింది.  ఈ ఏడాది ఆఖరులో 'స్పిరిట్' మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కి 'జోడీగా' మృణాల్ ఠాకూర్ ని తీసుకొనే ఆలోచనలో సందీప్ రెడ్డి ఉన్నాడనే ప్రచారం నడుస్తోంది. బిటౌన్ లో కూడా స్పిరిట్ మూవీ కోసం ఆమె పేరే ప్రముఖంగా వినిపిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: