అక్కడ దేవర కి తిరిగే లేదు.. ఏకంగా రెండు క్రేజీ మూవీలు పోస్ట్ పోన్..?

Pulgam Srinivas
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర అనే సినిమాలో హీరోగా నటించాడు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా జాన్వీ కపూర్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే మొదటి నుండి కూడా ఈ మూవీ బృందం హిందీ ఆడియన్స్ ను ఫస్ట్ టార్గెట్ గా పెట్టుకుంది. హిందీ లో సినిమాకు మంచి టాక్ వచ్చినట్లు అయితే చాలా ఎక్కువ మొత్తంలో కలక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.

ఇన్ని రోజుల పాటు ఈ సినిమాకు హిట్ టాకు వచ్చిన కూడా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు రావడం కష్టమే అని చాలా మంది భావించారు. ఎందుకు అంటే హిందీ సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న రెండు సినిమాలు దాదాపు ఈ మూవీ విడుదల అయిన తర్వాత తక్కువ కాలంలోనే రిలీజ్ కు రెడీగా ఉండడం. కానీ ఆ రెండు మూవీ లు కూడా పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా అక్షయ్ కుమార్ "స్కై ఫోర్స్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇదే డేట్ కి వస్తుంది అనుకున్న ఆలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన జిగ్రా మూవీ కూడా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 11 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇలా మంచి క్రేజ్ ఉన్న ఈ రెండు సినిమాల విడుదల తేదీలు పోస్ట్ పోన్ కావడం వల్ల ఈ మూవీ కి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ దొరికే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: