జానీ మాస్టర్ కు మద్దతుగా.. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ భార్య?

praveen
సౌత్ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న జానీ మాస్టర్ పై అత్యాచార ఆరోపణలు రావడం ఎంత సంచలనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా జానీ మాస్టర్ దగ్గర ఎన్నో రోజులపాటు అసిస్టెంట్ గా పని చేసిన లేడీ డాన్సర్.. తనపై జానీ మాస్టర్ ఎన్నోసార్లు అత్యాచారం చేశాడని.. అంతేకాదు దారుణంగా దాడి చేసి గాయపరిచాడు అంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

 ఈ క్రమంలోనే అటు జానీ మాస్టర్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడంతో.. ఇక కేసు ఆ పోలీస్ స్టేషన్కు బదిలీ అయింది. అయితే కేవలం జానీ మాస్టర్ మీద మాత్రమే కాకుండా ఆయన భార్యపై కూడా లేడీ డాన్సర్ షాకింగ్ ఆరోపణలు చేసింది. ఏకంగా భార్య కూడా తన భర్తతో గడపాలని ఎప్పుడూ ఒత్తిడి చేస్తూ ఉండేది అంటూ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలు సంచలనంగానే మారిపోయాయి. ఒకవేళ ఆధారాలు ఉంటే తప్పకుండా తనను శిక్షించాలి అంటూ జానీ మాస్టర్ ఈ ఘటనపై స్పందించారు. అయితే జానీ మాస్టర్ పై అత్యాచార ఆరోపణలు నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అటు లేడి డాన్సర్ కే మద్దతుగా నిలుస్తూ ఉన్నారు  

 కానీ ఇటీవలే మహిళా కొరియోగ్రాఫర్ ఏకంగా జానీ మాస్టర్ కు మద్దతుగా నిలిచారు. ఆమె చేసిన కామెంట్స్ కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి. బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ భార్య జ్యోతి రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు అమ్మాయిలు ఈ మధ్యకాలంలో చాలా స్మార్ట్ గా ఆలోచిస్తున్నారు. చట్టాలను ఓవర్ స్మార్ట్ గా వినియోగిస్తున్నారు. లైఫ్ లో బాగా కష్టపడి ఎదిగిన అబ్బాయిల జీవితాలను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. అలాంటి వారిని కూడా కఠినంగా శిక్షించాలి. ఏమైనా రెండు వైపులా విన్న తర్వాతే మాట్లాడాలి. అతనికి పేరు వచ్చింది కదా అని ఇక అతన్ని పదేపదే బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు అంటూ జ్యోతి రాజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారిపోయాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: