సింగర్ తో ఎఫైర్.. పేరెంట్స్ ని కత్తితో బెదిరించిన జయం రవి..?

Pandrala Sravanthi
 ప్రస్తుతం జయం రవి గురించి కోలీవుడ్ మీడియాలో ఎన్నో పుకార్లు ప్రచారం అవుతున్నాయి. దానికి ప్రధాన కారణం ఆయన తన భార్యకు విడాకులు ఇచ్చిన వెంటనే మరో సింగర్ తో సహజీవనం చేస్తున్నట్టు వార్తలు రావడమే. సింగర్ కెనీషా తో జయం రవి ఉన్న ఫోటోలు,వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. దాంతో జయం రవి బండారం మొత్తం బయటపడింది. అయితే జయం రవి ఎఫైర్ పెట్టుకున్న ఆ సింగర్ కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ లో పాటలు పాడిందని తెలుస్తోంది. అలాగే గోవాలోని పబ్బుల్లో ఈమె స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇస్తుందట.అలా ఓ రోజు గోవాకి వెళ్ళిన సమయంలో జయం రవికి పరిచయమై అది కాస్త రిలేషన్ కి దారితీసినట్టు తెలుస్తోంది. అయితే సింగర్ కెనీషా అఫైర్ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో మరో షాకింగ్ వార్త బయటపడింది. 

అదేంటంటే..హీరో జయం రవి పెళ్లి కోసం తన తల్లిదండ్రులను ఇద్దరినీ కత్తితో బెదిరించారట.మరి ఇంతకీ కెనీషా కోసమే పేరెంట్స్ ని బెదిరించాడా..అసలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ లో ఎంత ఎంత ఉంది అనేది చూద్దాం. జయం రవి కత్తితో తల్లిదండ్రులను బెదిరించింది సింగర్ కెనీషా కోసం కాదు ఆర్తి కోసమట.. అయితే గతంలో ఆర్తిని ప్రేమించిన సమయంలో తల్లిదండ్రులు ఆమెతో పెళ్లికి ఒప్పుకోలేదట.దాంతో  ఓ రోజు జయం రవి కత్తి తో పొడుచుకొని చచ్చిపోతాను అని తల్లిదండ్రులను బెదిరించారట.అంతేకాదు ఆయన సినిమాల కోసం బరువు తగ్గడంతో తల్లిదండ్రులు ఇద్దరు భయపడి అమ్మాయి కోసమే బెంగపెట్టుకొని అలా తిండి నిద్ర మానేసాడు అని అర్థం చేసుకొని ఆర్తితో పెళ్లికి ఒప్పుకున్నారట.

 అలా అప్పట్లో జయం రవి తల్లిదండ్రులను కత్తితో బెదిరించారు అనే విషయం కోలీవుడ్లో సంచలనం సృష్టించింది. ఈ విషయం అంతా పక్కన పెడితే ప్రస్తుతం భార్యకి ఇష్టం లేకుండా విడాకులు ఇచ్చిన జయం రవి గోవా లోనే ఉంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు పిల్లల కోసం మళ్లీ వీరిద్దరి మధ్య సంధీ కుదిర్చి ఎప్పటిలాగే భార్యాభర్తలు గా చూద్దామని తల్లిదండ్రులు చూసినప్పటికీ వారి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకుండా ఊరినే వదిలి వెళ్ళిపోయారట. అలా జయం రవి ప్రస్తుతం ఎవరి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదని తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: