ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ అప్పటి నుండే..!?

Anilkumar
దేవర మూవీ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. సైఫ్ అలీఖాన్ విలన్. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 27న విడుదల కాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్స్ లోనే ఉన్నాడు ఎన్టీఆర్. అయితే రీసెంట్ చెన్నై వెళ్లినప్పుడు వేదిక మీదే తన ఫేవరెట్ డైరెక్టర్ వెట్రి మారన్ ను తనతో సినిమా చేయమని అడగటం అక్కడి వారికి బాగా నచ్చింది. తర్వాత కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూస్ ఇచ్చాడు ఎన్టీఆర్. 'దేవర' విడుదలకు మరో వారం ఉన్న నేపథ్యంలో ఆదివారం (సెప్టెంబర్ 22న) ప్రీ రిలీజ్

 ఈవెంట్ పెద్ద ఎత్తున పాన్ చేశారు. హైదరాబాద్ నోవాటెల్ వేదికగా జరిగే ఆ వేడుకలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, మాటల మాంత్రికుడు - గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రశాంత్ నీల్ అటెండ్ అవుతారని సమాచారం.  ఇదిలవుండగా నీల్ దర్శకత్వంలో Jr.ఎన్టీఆర్ హీరోగా నటించబోయే సినిమా షూటింగ్ అక్టోబర్ 21 నుంచి ప్రారంభం కానుంది. 'దేవర' ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు.  ఈ షెడ్యూల్లో 40 రోజులపాటు ఇతర నటీనటులతో సీన్లను షూట్ చేస్తారని, తాను 2025 జనవరి నుంచి సెట్స్ లో జాయిన్ అవుతానని పేర్కొన్నారు. ఇక దేవర విషయానికి వస్తే.. ఈ సినిమా

 విడుదలకు మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే యూఎస్ లో బుకింగ్స్ ఓపెన్ చేసారు. అక్కడ దేవర్ టికెట్స్ కు మంచి క్రేజ్తో అమ్ముడైపోతున్నాయి. ఇప్పటికే అక్కడ ప్రీ బుకింగ్స్ ద్వారా $2 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. మరోవైపు అభిమానులు ఈ సినిమా టికెట్స్ కోసం బుక్ మై షో ఓపెన్ చేస్తే దెబ్బకు క్రాష్ అయిపోయింది.  ఇక ఇటీవల చెన్నై వెళ్లి అక్కడ ఓ ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తమిళంలో నాకు బాగా నచ్చే డైరెక్టర్ వెట్రిమారన్ .. అతను పేరు చెబుతూ ప్లీజ్ నార్ నాతో డైరెక్ట్ తెలుగు మూవీ ఒక్కటి చేయండి. నేను అది తెలుగులో డబ్ చేసుకుంటానని రిక్వెస్ట్ చేసారు. అయితే, ఎన్టీఆర్ కి వెట్రిమారన్ తో మూవీ చేయాలనే ఆశ ఉన్నట్టు అర్ధమవుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: