ఆ చిన్న తప్పు వల్ల అన్ని ఆఫర్లను కోల్పోయిన అరవింద స్వామి..?

MADDIBOINA AJAY KUMAR
బొంబాయి , రోజా మూవీ లతో దేశవ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకున్న నటులలో అరవింద స్వామి ఒకరు. ఈయన కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. అలా కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన రీ ఎంట్రీలో భాగంగా జయం రవి హీరోగా నయనతార హీరోయిన్గా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన తని ఒరివన్ అనే తమిళ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఈ మూవీలోని అరవింద స్వామి నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ప్రశంసలు వెల్లువెత్తాయి. దానితో ఈయనకు సూపర్ క్రేజ్ లభించింది.

ఇకపోతే తని ఒరివన్ మూవీని తెలుగులో రామ్ చరణ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా సురేందర్ రెడ్డి రీమిక్ చేశాడు. ఈ మూవీ లో కూడా అరవింద స్వామి విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించడంతో ఈయనకు తెలుగు లో కూడా మంచి గుర్తింపు లభించింది. కొంత కాలం క్రితం వెంకట్ ప్రభు దర్శకత్వంలో మానాడు అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. శింబు ఈ సినిమాలో హీరోగా నటించగా , ఎస్ జే సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఇక వెంకట్ ప్రభు ఈ మూవీలో విలన్ పాత్రకు మొదటగా అరవింద స్వామి ని సంప్రదించాడట.

కానీ ఆయన ఆ సమయంలో ఇతర మూవీలతో బిజీగా ఉండటంలో ఆ సినిమా చేయలేను అని చెప్పాడట. దానితో ఆయన ఎస్ జె సూర్యను సంప్రదించడం , ఆయన ఈ మూవీకి ఓకే చెప్పడం జరిగిందట. అలా అరవింద స్వామి "మానాడు" మూవీ ని మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మానాడు మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడం , ఈ మూవీలో ఎస్ జె సూర్య నటనకు మంచి ప్రశంసలు రావడంతో ప్రస్తుతం సూర్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: