నేను ఏసీ వ్యాన్ లో.. రజిని నేల మీద.. షాకింగ్ విషయం చెప్పిన అమితాబ్?

praveen
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. మొన్నటికి మొన్న జైలర్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన రజిని.. మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కేసాడు అన్న విషయం తెలిసిందే. అంతకుముందు ఎన్ని సినిమాలు తో ప్రేక్షకులు ముందుకు వచ్చిన బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయిన రజిని.. జైలర్ తో మాత్రం అభిమానులందరికీ కూడా ఫుల్ మీల్స్ పెట్టేసాడు అని చెప్పాలి. అయితే ఇప్పుడు వెట్టయాన్  అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాపై భార్య రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి.

 ఎందుకంటే సూర్యతో జై భీమ్ లాంటి ఒక వైవిద్యమైన కాన్సెప్ట్ ను తీసుకొని సూపర్ హిట్ కొట్టిన జ్ఞానవేల్.. ఇక ఇప్పుడు వెట్టయాన్* అనే మూవీకి దర్శకుడుగా వ్యవహరించబోతున్నాడు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడటానికి అభిమానులు అందరూ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పాలి. కాగా ఈ మూవీలో అమితాబచ్చన్ లాంటి అగ్రనటులు కనిపించబోతూ ఉండడంతో.. సినిమాపై ఉన్న అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. అమితాబ్ మాత్రమే కాకుండా రానా, మంజు వారియర్, ఫహద్ ఫాసిల్ లాంటి విలక్షణ నటులు కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారు.

 ఇకపోతే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతూ ఉండగా ఇటీవల చెన్నైలో అటు ఆడియో లాంచ్ కార్యక్రమం కూడా జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో అమితాబచ్చన్ పాల్గొనక పోయినప్పటికీ తన వీడియో మెసేజ్ మాత్రం పంపించారు. ఈ క్రమంలోనే రజినీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇది నా తొలి తమిళ సినిమా. 1991లో వచ్చిన హమ్ సినిమాలో నేను రజనీ కలిసి నటించాం. ఆ సినిమా షూటింగ్ సమయంలో నేను క్యారెవ్యా న్లో ఏసీలో పడుకుంటే రజిని మాత్రం నేల మీద పడుకునేవారు. ఆయన సింప్లిసిటీ చూసి ఆశ్చర్యపోయా. నేను కూడా ఆయనతోపాటు నేల మీద పడుకోవడం మొదలు పెట్టాను అంటూ అమితాబ్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: