జానీ మాస్టర్ ఇష్యూ.. పుష్ప 2 సెట్లోనే అంతా జరిగిందా..?

murali krishna
టాలీవుడ్ లో బెస్ట్ డాన్స్ మాస్టర్ గా పేరొందిన జానీ మాస్టర్ ఎన్నో సినిమాలకు కొరియగ్రఫీ చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు.. ఇటీవల ఆయనకు నేషనల్ అవార్డు కూడా రావడం విశేషం.. ఇంతటి పేరు సంపాదించుకున్న జానీ మాస్టర్ పై తన అసిస్టెంట్ అత్యాచారం కేసు పెట్టింది..గత కొన్ని రోజులుగా జానీ మాస్టర్ వ్యవహారం తెగ వైరల్ అవుతుంది. జానీ మాస్టర్ తనను చాలా సార్లు వేదించారాని తాను మైనర్ ఉన్నప్పటి నుంచి తనపై అత్యాచారం చేసినట్లు ఆమె మాస్టర్ పై కంప్లైంట్ ఇచ్చింది. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి మాస్టర్ ను పోలీసులుఅరెస్ట్ చేసారు.. అయితే జానీ మాస్ట‌ర్ వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. రోజుకో నిజం బ‌య‌ట‌కు పడుతుంది..జానీ మాస్ట‌ర్‌కూ బాధితురాలికీ మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చాల‌ని ఓ పెద్ద హీరో ప్ర‌య‌త్నించిన‌ట్టుగా కూడా వార్త‌లొచ్చాయి. ఇప్పుడు ద‌ర్శ‌కుడు సుకుమార్ పేరు కూడా బ‌య‌ట‌కు రావడంతో ఈ వ్యవహారం కాస్త హాట్ టాపిక్ గా మారింది..జానీ మాస్ట‌ర్‌నీ, ఆ బాధితురాలినీ సుకుమార్ పిలిపించి మాట్లాడినట్టు, ఇద్ద‌రి మ‌ధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్టు స్వ‌యంగా జానీ మాస్ట‌ర్ స‌తీమ‌ణి సుమ‌లత తెలిపారు.

అయితే మ‌రోవైపు ‘పుష్ష 2’ సినిమా సెట్లో జానీ మాస్ట‌ర్ కూ, త‌న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కూ మ‌ధ్య గొడవ జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది.. ‘పుష్ష 2’ లో బాధిత కొరియోగ్రాఫ‌ర్ ఓ సాంగ్ ను కూడా కంపోజ్ చేసింద‌ని, అదే స‌మ‌యంలో జానీ మాస్ట‌ర్ సెట్ లో ఆమెతో గొడ‌వ పడినట్లు ఈ గొడ‌వ‌తో షూటింగ్ కూడా ఆగిపోయింద‌ని సమాచారం.దీనితో సుకుమార్  క‌ల‌గజేసుకోవడంతో గొడ‌వ సర్దుమనిగిందని వార్తలు వస్తున్నాయి..అయితే సుమలత మాత్రం అలాంటిది ఏమి జరగలేదు అందులో నిజం లేదు...బాధిత కొరియోగ్రాఫ‌ర్ త‌న వ‌య‌సు కూడా దాచేసి అబద్దం చెబుతుందని ఆమె తెలిపింది.., ఢీలో అడుగుపెట్టే స‌మయానికే ఆమె మేజ‌ర్ అని సుమ‌ల‌త‌ ఆరోపించారు.అయితే మొత్తం వ్య‌వ‌హారంలో బాధితురాలి త‌ల్లి సూత్రధారి అని ఆమె ఎందుకు బయటకు రావడం లేదు, నోరు విప్పట్లేదని సుమలత ప్రశ్నించింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: