పవన్ ఓటు వీరమల్లు కే.. మరి 'ఓజీ' పరిస్థితి ఏంటో..?

murali krishna
తెలుగు సినిమా తిరుగులేని హీరోగా పవర్ స్టార్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్, ప్రజా సేవే లక్ష్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి, అక్కడా గొప్ప నాయకుడిగా పేరు గడించాడు. రాజకీయాల్లో ప్రవేశించాకా చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయడంపైనే దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా ముందుగా ఎపుడో షూటింగ్ మొదలు పెట్టిన'హరి హర వీర మల్లు' సినిమా యొక్క మిగిలిన షూటింగ్ ను పూర్తి చేయడానికి రెడీ అవుతున్నారు. ముందుగా ఈ సినిమా కంప్లీటైన తర్వాత ‘ఓజీ’, ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలను పూర్తి చేయనున్నారు. అటు హరి హర వీరమల్లు రెండు భాగాలుగా రాబోతుంది. దీంతో ఈ ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ నుంచి ఈ నాలుగు సినిమాలు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు, ఆయన సినిమాలను ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన విజయం సాధించిన తర్వాత, డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్, పూర్తి స్థాయిలో రాజకీయాల్లో పాల్గొన్నారు.
అయితే, ఆయన మళ్లీ సినిమాల్లో ఎప్పుడు అడుగుపెడతారు అని ఎదురుచూస్తున్నవారికి 'హరిహర వీరమల్లు' టీమ్ క్రేజీ న్యూస్ చెప్పింది.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ న‌టిస్తున్న సినిమాల్లో ‘హరి హర వీర మల్లు’ ఒక‌టి. జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ మూవీ నుంచి తాజాగా చిత్ర బృందం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. సెప్టెంబ‌ర్ 23 నుంచి భారీ యాక్ష‌న్ సీక్వెన్ ను తెర‌కెక్కించ‌నున్న‌ట్లు తెలిపింది.వాస్తవానికి ‘హరిహర వీరమల్లు’ పై అభిమానుల్లో పెద్దగా ఆసక్తి లేదు. దర్శకుడు క్రిష్ చేసిన గత సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడం వల్ల అనుకోవచ్చు. అయినప్పటికీ ఇది కోవిడ్ కి ముందు మొదలుపెట్టిన సినిమా. నిర్మాత ఏ.ఎం.రత్నం వడ్డీల రూపంలో భారీ మొత్తం చెల్లిస్తున్నారు.అతనిపై మరింత భారం పెట్టడం పవన్ కి ఇష్టం లేదు. అందుకే ముందుగా పవన్ ‘హరిహర వీరమల్లు’ కి డేట్స్ ఇస్తున్నట్టు స్పష్టమవుతుంది.ఇదిలావుండగా హాలీవుడ్ లెజెండ్ నిక్ పావెల్ స్టంట్ డైరెక్షన్‌లో ఈ యాక్ష‌న్ సీక్వెన్స్‌ను చిత్రీక‌రించ‌నున్నామ‌ని, ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం పాల్గొంటార‌ని తెలిపింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ.. మూవీలోని ప‌వ‌న్ గెట‌ప్ సంబంధించిన కొత్త ఫోటోను పోస్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: