వెన్నుపోటుదారుడికే వెన్నుపోటు.. పవన్ అదిరిపోయే స్ట్రాటజీకి లోకేష్ ఒక్కటే ఏడుపు..?

Suma Kallamadi
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 మేజర్ రీజనల్ పార్టీలు ఉన్నాయి. అందులో రెండు పార్టీలు ఆల్రెడీ అధికారంలోకి వచ్చాయి. అవే వైసీపీ, టీడీపీ. ఇక ఏపీలో మిగిలిన అతిపెద్ద రీజనల్ పార్టీ జనసేన పార్టీ. ఏపీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 21 చోట్ల పోటీ చేసి అన్నింటా గెలుపొంది చరిత్ర సృష్టించిన పార్టీ జనసేన పార్టీ. ఎంపీ ఎలక్షన్లలో కూడా కూడా సెంటు పర్సెంట్ సక్సెస్ సాధించింది. జనసేన ఏపీలో అనూహ్యమైన బలాన్ని పుంజుకుంది. 2029 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఏపీ ప్రజలు ఎప్పటికప్పుడు కొత్త పాలన కోరుకుంటారు.
ఆంధ్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ పైన నమ్మకం అనేది చాలా పెరిగిపోయింది. పవన్ నీతి, నిజాయితీ గల రాజకీయ నాయకుడు అనేది వాస్తవం. దోచుకుని దాచుకునే నేత కాదు అని చాలా మంది నమ్ముతున్నారు. సాధ్యమైనంతవరకు ఏపీకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ నడుచుకుంటున్నారు. సంగతి అందరికీ స్పష్టంగా తెలుస్తోంది. ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటారనడానికి వాళ్లు కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ చివరికి జనసేన పార్టీని గెలిపించడమే నిదర్శనం అని చెప్పుకోవచ్చు.
జనసేన అధినేత పవన్ ఓన్లీ డిప్యూటీ సీఎంతో సరిపెట్టుకోవాలనుకోవడం లేదు. ఆయన ఆశయం ఏపీకి సీఎం కావడం, ఆ హోదా ద్వారా రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి మంచి చేయడం. సీఎం అవ్వాలనే కోరికను ఆయన వదులుకోలేదు. అదే దిశగా ఆయన అడుగులు కూడా పడుతున్నాయి. అందుకు ప్రస్తుతం పవన్ ఒక పొలిటికల్ స్ట్రాటజీని అమలు చేస్తూ వెళ్తున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
పవన్ జనసేన పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ వెళ్తున్నారు. పార్టీలోకి వచ్చిన ప్రతి నేతకు కావాల్సిన స్వేచ్ఛ అందిస్తున్నారు. వైసీపీలోని చాలామంది కీలక నేతలు జనసేన పార్టీలో చేరడానికి మొగ్గు చూపిస్తున్నారు. టీడీపీలో ఎలాగూ చాలామంది కమ్మ సామాజిక నేతలు ఉన్నారు. అదొక హౌస్ ఫుల్ పార్టీ లాగా కనిపిస్తోంది. అందులోకి వెళ్లడం వల్ల ఎలాంటి అవకాశాలు రావు అనుకుని జనసేనలోకి వెళ్తున్నారు. వచ్చిన ప్రతి వారిని కాదనకుండా చేర్చుకుంటోంది జనసేన.
వైసీపీలో చేరిన ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. అందులో ఉన్నా రాజకీయంగా ఎదుగుదల కనిపించే అవకాశం లేదని చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఓన్లీ జగన్ వాలంటీర్ వ్యవస్థ మాత్రమే ప్రజలతో టచ్ లో ఉంటారు. అందులో నేతల మాటలు నెగ్గవు. పవన్ ఇతర పార్టీ అధినేతల వలె నియంతగా పోకడలు చూపించరు. ఒక నాయకుడిని నమ్మితే వారికే పూర్తి నియోజకవర్గ పగ్గాలు అప్పగిస్తారు. జనసేనలో చేరితో బలమైన కాపు సామాజిక వర్గం అండ లభిస్తుంది. ఏపీలో మొత్తం జనాభాలో పాతిక శాతం ఆ సామాజిక వర్గ ప్రజలే ఉన్నారు కాబట్టి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. మెగా ఫ్యాన్స్ ఓట్లు కూడా పడిపోతాయి. యువ ఓటర్లను ప్రత్యేకంగా ఆకర్షించాల్సిన అవసరం ఉండదు. జనసేనలోకి అడుగుపెడితే సాలిడ్ ఓటు బ్యాంకు సొంతమవుతుంది. అందుకే అందరూ ఈ పార్టీ వైపే వస్తున్నారు. వారందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ పవన్ రాజకీయంగా బాగా బలపడుతున్నారు. ఐదేళ్లలో ఆయన మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది.
అప్పుడు టీడీపీ వాళ్లు అతన్ని బయటకు తరిమేసినా ఒంటరిగా పోరాటం చేసి సీఎం అవగలుగుతారు. ఒకవేళ అదే జరిగితే లోకేష్ ఏడుస్తారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన చాలా రోజులుగా సీఎం కుర్చీలో కూర్చోవాలని ట్రై చేస్తున్నారు. కానీ పవన్ తన పొలిటికల్ స్ట్రాటజీతో చంద్రబాబుకి వెన్నుపోటు పొడవడానికి రెడీ అయినట్లుగా పలువురు మాట్లాడుకుంటున్నారు. మామను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని చాలామంది విమర్శిస్తుంటారు. అయితే. ఇప్పుడు ఆ వెన్నుపోటుదారుడికి పవన్ వెన్నుపోటు పొడుస్తారేమో అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: