సమంత ముఖానికి మ్యాక‌ప్ నప్పడంలేదా?

Suma Kallamadi
స్టార్ హీరోయిన్ స‌మంత గురించి తెలుగు జనాలకి చెప్పాల్సిన పనిలేదు. సమంత ఇక్కడికి వచ్చి రావడంతోనే 'ఏం మాయ చేసావే' సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకుంది. కట్ చేస్తే, ఆమె వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకుంటూ తెలుగులో తిష్ట వేసింది. ఈ క్రమంలో ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. చిన్న నటులనుండి, అగ్ర నటుల వరకు.. అందరితోనూ ఆమె నటించి మెప్పించింది. మరో విషయం ఏమిటంటే... ఆమెకి గోల్డెన్ లెగ్ అనే పేరు ఉండేది.. అందుకే ఆమె డేట్స్ ఇక్కడ ఖాళీ ఉండేవి కాదు. కానీ నేడు పరిస్థితి మారింది. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు కదా? ప్రస్తుతం ఆమె అడపాదడపా సినిమాలలో కనిపిస్తోంది.
ఆమధ్య అనారోగ్యం కారణంగా ఆమె ఆరోగ్యం కాస్త క్షిణించిన సంగతి విదితమే. న‌టిగా ఆమె ముఖానికి మ్యాక‌ప్ వేసుకుని ఏడాది దాటింది. చివ‌రి సారిగా విజయ్ దేవరకొండ నటించిన 'ఖుషీ' సినిమాలో హీరోయిన్ గా న‌టించింది. అంత‌కు ముందే 'సీటాడెల్' ఇండియ‌న్ వెర్ష‌న్ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసి, వెంట‌నే అమెరికా వెకేష‌న్ చెక్కేసింది. తరువాత కొన్నినెల‌ల తరువాత అమ్మ‌డు మ‌ళ్లీ ఇండియాకి తిరిగొచ్చింది. అప్ప‌టి నుంచి స‌మంత కొత్త సినిమా వివరాలు పెద్దగా తెలియడం లేదు. ఆమె ప్రస్తుతం ఇంకా విశ్రాంతిలోనే ఉన్నట్టు కనబడుతోంది. విషయం ఏమిటంటే.... ఆమెకి మునిపటిలా మేకప్ పట్టడం లేదని గుసగుసలు వినబడుతున్నాయి.
దాంతో సమంత అభిమానులు కాస్త విచారంలో ఉండగా... తాజాగా అమ్మ‌డు సినిమాకి బ‌ధులు ఓ వెబ్ సిరీస్ కోసం మ్యాక‌ప్ వేసుకోవ‌డానికి రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్న 'ర‌క్త బ్ర‌హ్మాండ్' వెబ్ సిరీస్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కాగా ఈ యాక్ష‌న్ ఫాంట‌సీలో స‌మంత ప్ర‌ధాన పాత్ర చేయబోతోందని వినికిడి. తాజాగా ఈ వెబ్ సిరీష్ షూటింగ్ ప్రారంభ‌మైంద‌ని స‌మంత స్వయంగా ప్ర‌క‌టించింది. 'ఎప్ప‌టికీ క‌ల‌లు క‌న‌డం ఆపొద్దు. చాలా కాలం త‌ర్వాత మ‌ళ్లీ సెట్స్ పైకి రావ‌డం ఎంతో ఆనందంగా ఉంది!' అంటూ పోస్ట్ చేయడంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. దాంతో సమంత మ్యాక‌ప్ వేసుకోడం క‌న్ప‌మ్ అయింది. ఏడాది కాలంగా న‌ట‌న‌కు దూరంగా ఉన్న అమ్మ‌డు మ‌ళ్లీ వెబ్ సిరీస్ తో కంబ్యాక్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: