పవన్ ఫ్యాన్స్ కి బిగ్ అప్డేట్.. ఆ సినిమా రిలీజ్ డేట్ లాక్..!

Divya
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం తాజా అప్డేట్ ఈ రోజున చిత్ర బృందం ప్రకటించారు..గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండడం చేత ఆయన సినిమా షూటింగులకు డేట్లు కేటాయించలేకపోతున్నారు. దీంతో నిర్మాతలు ఇబ్బందులకు పడుతున్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించి ఎట్టకేలకు ఈ నెల నుంచి సినిమా షూటింగ్ మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారట. ఒకవైపు డిప్యూటీ సీఎం హోదాలో కూడా తన వృత్తిని చేపడుతూనే ముందుకు వెళ్తున్నారు అభిమానులు.

పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా అయినా హరిహర వీరమల్లు చిత్రం  నుంచి పోస్టర్స్ , గ్లింప్స్ మాత్రమే విడుదల అవ్వగా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా షూటింగ్ ఎన్నోసార్లు కూడా వాయిదా పడినట్లుగా తెలిసింది.. అయితే ఈరోజు ఉదయం విజయవాడలో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారట.ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా తెలియజేస్తూ రిలీజ్ డేట్ ను కూడా విడుదల చేసింది.

హరిహర వీరమల్లు మొదటి భాగం వచ్చేయేడాది సంక్రాంతి 2025 మార్చి 28న రిలీజ్ చేయబోతున్నట్లు కొత్త పోస్టర్స్ తో ప్రకటించారు. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించే విధంగా చిత్ర బృందం అనౌన్స్మెంట్ చేసింది. ఇప్పుడు మొదటి భాగం తెరకెక్కించడానికి ఇన్ని సంవత్సరాలు పడుతోంది .మరి రెండవ భాగం అంటే ఇక ఎన్నేళ్లు పడుతుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా మొత్తానికి హరిహర వీరమల్లు సినిమా నుంచి అప్డేట్ రావడంతో ఖుషి అవుతున్నారు. AM రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా ఇందులో పవన్ కు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తున్నది.. అలాగే బాలీవుడ్ నటులు అనుపమ ఖేర్ , బాబి డియోల్ వంటి వారు కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. తాజా పోస్టర్లో పవన్ కళ్యాణ్ కత్తి ఎత్తి పట్టుకొని ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: