రూ.50 లక్షల విరాళం అందజేసిన సూపర్ స్టార్ దంపతులు.. మరో 10 లక్షలు కూడా..

Suma Kallamadi
భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలలో వారి వరదలు వచ్చి అనేకమంది ఇబ్బందులు పడిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు ప్రముఖ సినీ ఆర్టిస్టులు, హీరోలు భారీగా విరాళాలు అందిస్తున్న సంగతి అందరికీ విధితమే. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోటి రూపాయలను ప్రకటించిన సంగతి కూడా అందరికి విధితమే. ఇందులో 50 లక్షల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి, అలాగే మరో 50 లక్షలు రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇస్తున్నట్లు మహేష్ తెలియజేశారు. అయితే ఈ క్రమంలో తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డిని అతని నివాసంలో కలిసి 50 లక్షలు రూపాయల చెక్కులు అందచేశారు. ఈ సందర్బంగా సూపర్ స్టార్ తో పాటు భార్య నమ్రత శిరోద్కర్ కూడా ఉన్నారు. అంతేకాకుండా., మహేష్ బాబు చెప్పిన దానికంటే మరో 10 లక్షల రూపాయలు కూడా అధికంగా విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో నివాసం ఉంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి 50 లక్షల రూపాయల చెక్కును  మహేష్ దంపతులు అందజేశారు. అనంతరం ఏఎంబి  నుంచి మరో 10 లక్షల రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి మహేష్ బాబు 60 లక్షల రూపాయలను వరద బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు దంపతులతో పాటు ఏఎంబి కి సంబంధించిన ప్రముఖులు కూడా హాజరైనట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన  ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా మహేష్ దంపతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కి కూడా విరాళాన్ని అతి త్వరలో అందజేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు సినిమాల  విషయానికి వస్తే.. ఎస్ఎస్ఎంబి 29 పేరుతో రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి అందరికీ విధితమే. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సమయంలో మహేష్ బాబు లుక్కు చూసి మహేష్ బాబు ఫ్యాన్స్ మహేష్ హెయిర్ స్టైల్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.. ఇక మరికొందరైతే రాజమౌళి ఏకంగా మహేష్ ను మార్చేశాడు కదా అంటూ కామెంట్ చేస్తున్నారు. తాజా మహేష్ లుక్ లో భిన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: