టాప్ హీరోలకు షాక్ ఇస్తున్న సందీప్ కిషన్ సాహసం !

Seetha Sailaja
ప్రముఖ కెమెరా మేన్ ఛోటాకే నాయుడు బ్యాకింగ్ తో ఇండస్ట్రీలోకి వచ్చిన సందీప్ కిషన్ కు వరసపెట్టి అవకాశాలు వస్తున్నాయి కానీ ఏఒక్క సినిమా చెప్పుకోతగ్గ స్థాయిలో సక్సస్ కాకపోవడంతో ఈహీరో స్థాయి పెరగలేదు. అయినప్పటికీ తనకు వస్తున్న ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ హిట్ గురించి ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈహీరో చేస్తున్న సాహసం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

2025 సంక్రాంతి రేస్ సీనియర్ హీరోల మధ్య పోటీగా మారింది. చిరంజీవి ‘విశ్వంభర’ బాలకృష్ణ బాబిల మూవీ వెంకటేష్ అనీల్ రావిపూడిల మూవీలతో పాటు తమిళ టాప్ హీరో అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలు విడుదల అవుతున్న నేపధ్యంలో ఈ నాలుగు సినిమాలకు తెలుగు రాష్ట్రాలలో ధియేటర్లు ఎక్కడ దొరుకుతాయి అన్న చర్చలు జరుగుతున్నాయి.

ఇలాంటి సంక్రాంతి రేస్ లో ఇప్పుడు సందీప్ కిషన్ మూవీ ఎంటర్ అవుతున్నట్లు సంకేతాలు రావడం చాలమండికి షాక్ ఇస్తోంది. దర్శకుడు నక్కిన త్రినాథ్ రావ్ ‘ధమాకా’ మూవీ తరువాత సందీప్ కిషన్ తో చేసిన ‘మజాకా’ మూవీ సంక్రాంతి రేస్ లో ఉంటుందని ఈమూవీ నిర్మాతల నుండి సంకేతాలు వస్తున్నాయి. అంతేకాదు ఈమూవీ ఓటీటీ డీల్ 20 కోట్లకు అమ్మకం జరిగింది అంటూ వస్తున్న లీకులు విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి.

వరస పరాజయాలతో సతమతమైపోయిన రవితేజాకు ‘ధమాకా’ ఊహించని బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి బ్రేక్ తనకు వస్తుందని సందీప్ కిషన్ భావిస్తున్నాడు అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. సంక్రాంతి రేస్ లో భారీ సినిమాల మధ్య విడుదలైన కొన్ని చిన్న సినిమాలు ఊహించని సక్సస్ అందుకున్న సందర్భాలు గతంలో ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ‘ఖైదీ నెంబర్ 150’ ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ లను తట్టుకుని శర్వానంద్ ‘శతమానంభవతి’ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరాం ‘గుంటూరు కారం’ ‘నా సామిరంగా’ ‘సైంధవ్’ సినిమాల పోటీని తట్టుకుని ‘హనుమాన్’ సూపర్ సక్సస్ అయింది. అలాంటి అవకసాం సందీప్ కిషన్ కు పడుతుందో లేదో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: