దేవర ను మల్టీప్లెక్స్ లో చూద్దాము అనుకుంటున్నారా.. అయితే మీకు బ్యాడ్ న్యూస్..?

MADDIBOINA AJAY KUMAR
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర మొదటి భాగం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా ... సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని పం ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయమన్నారు. ఇకపోతే ఆర్ ఆర్ ఆర్ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నటించిన మూవీ కావడం , అరవింద సమేత సినిమా తర్వాత ఈయన నటించిన సోలో హీరో మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

అలాగే ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించడంతో చాలా మంది ప్రేక్షకులు ఈ మూవీ యొక్క ప్రీమియర్స్ ను మల్టీప్లెక్స్ థియేటర్లలో చూడాలి అని అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ను పొందాలి అని అనుకుంటున్నా ఆడియన్స్ కూడా చాలా మంది ఉన్నారు. కానీ అలాంటి వారికి దేవర యూనిట్ నిరాశనే మిగిల్చబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... హైదరాబాద్ మరియు ఏపీ లలో సెలెక్టెడ్ థియేటర్లలో ఈ సినిమాకు సంబంధించిన అర్ధరాత్రి ఒంటి గంటకి షో లు ఉంటాయి.

కానీ హైదరాబాద్ మల్టీప్లెక్స్ లలో మాత్రం ఈ సినిమాకు సంబంధించిన అర్ధ రాత్రి షో లు లేవు అని తెలుస్తుంది. కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాత్రమే హైదరాబాద్లో ఈ సినిమా అర్ధరాత్రి షో లు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన అర్ధరాత్రి షో లను మల్టీ ప్లెక్స్ థియేటర్లలో చూడాలి అని అనుకునే ఆడియన్స్ కు ఈ మూవీ యూనిట్ నిరాశనే మిగిల్చబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: