దేవరలో జాన్వి పాత్ర అంత లేటుగా ఎంట్రీ ఇస్తుందా.. నిజంగా ఫాన్స్ కి నిరాశే?

praveen

తెలుగునాట ఇపుడు ఎక్కడ చూసినా, విన్నా దేవర మాటే వినబడుతోంది. అంతేకాకుండా ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్లో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, దర్శకుడు శివతో తమ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడం చేత ఈ సినిమా పైన ఎక్కువ అంచనాలే ఉన్నాయి. అవును, ఈ భారీ ప్రాజెక్ట్ పైనే చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా హీరోయిన్ జాన్వీ కపూర్ "దేవర" ఫలితాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు కనబడుతోంది. ఎందుకంటే ఇది ఆమెకి మొట్ట మొదటి తెలుగు సినిమా పైగా సీనియర్ నటి శ్రీదేవి కూతురు. దాంతోనే ఆమెతో పాటుగా తెలుగు వాళ్ళు కూడా మన శ్రీదేవి కూతురు అని ఈ సినిమాకోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి.
అయితే ఇక్కడ అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ ఏమిటంటే... ఈ సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉందని, పైగా సగం సినిమా అయిపోయిన తరువాతనే ఆమె తెరపై కనిపించనుందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఇందులో నిజం ఎంతుందో ఎవరికీ తెలియదు కానీ ఈ విషయం సోషల్ మీడియాలో వచ్చిన నటి నుండి అభిమానులు ఒకింత అసహనానికి గురైనట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తం కథ ఆమె చుట్టూనే తిరిగినప్పటికీ ఆమె వచ్చేది మాత్రం ఇంటర్వెల్ తరువాతే అని అంటున్నారు. అయితే నిజానిజాలు సినిమా విడుదల అయితే గానీ తెలియవు!
ఇకపోతే... ఈ భారీ ప్రాజెక్ట్ లో మొదటి జాన్వీ కపూర్ ఛాయిస్ కానే కాదట. దేవర సినిమా అనుకున్న సమయంలో కొరటాల శివకి గాని అలాగే ఎన్టీఆర్ కి గానీ ఆ ఆలోచన రాలేదట. చాలాసార్లు జాన్వీ ఎన్టీఆర్ తో నటించాలని ఉందని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది.. దాంతోనే వారికి జాన్వీని హీరోయిన్ గా ఛాన్స్ ఇద్దాం అని అనిపించిందట. కాగా ఈ చిత్రం మొదలు పెట్టిన సమయంలో అంటే సుమారుగా, 2023 ఏప్రిల్ సమయంలో అయితే హీరోయిన్ రష్మికా మందన్నా పేరు బాగా వినబడింది. కానీ ఫైనల్ గా జాన్వీ కపూర్ లైన్లోకి వచ్చి చేరింది. కాగా ఈ చిత్రానికి సంగీత సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందించగా, ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అనే కొత్త నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ 27న పాన్ ఇండియా భాషల్లో దేవర ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: