హేమ కమిటీ దెబ్బకు పరారీలో ప్రముఖ నటుడు..!

Divya
మలయాళ సినీ ఇండస్ట్రీలో హేమ కమిటీ గత నెల రోజుల నుంచి కుదిపేస్తోంది. మలయాళ సినీ పరిశ్రమలో మహిళలపై జరిగిన కొన్ని లైంగిక వేధింపుల సమస్యలను హేమ కమిటీ ద్వారా బయటపడడంతో కొంతమంది డైరెక్టర్లు ,నటుల సైతం అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మలయాళ నటులలో ఒకరైన సిద్ధిఖి పైన కూడా కేరళ పోలీసులు అరెస్టు వారింటి కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ నటుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా మలయాళ సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్న ఈ విషయం పైన పోలీసులు కూడా ఈ నటుడు కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

హేమ కమిటీతో పాటు మీటూ ఉద్యమం కూడా చాలామంది నటీనటులు, హీరోలు ,డైరెక్టర్లను సైతం వివాదాలకు ఇరుక్కునేలా చేస్తోంది. నటుడు సిద్ధిఖి పైన ఒక నటి అత్యాచార ఆరోపణల విషయం పైన ఫిర్యాదు చేయగా.. తనని అవకాశాలు కావాలి అంటే కోరిక తీర్చమంటూ బలవంతం చేశారంటు తన డిమాండ్లను ఒప్పుకోకపోవడంతో సిద్ధిఖి తనమీద అత్యాచారం చేశారంటూ నటి ఫిర్యాదులో 2016లో తెలియజేసింది. అయితే ఆ సమయంలో సిద్ధిఖి ఈ విషయాలను సైతం ఖండించారు.

2019లో సోషల్ మీడియా వేదికగా తన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. అలాగే సిద్ధికి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసుకున్నారట. అయితే ఈ విషయాన్ని కేరళ హైకోర్టు కొట్టేసింది.. ఈ విషయం పైన ఆరోపణలు చేసినటువంటి నటి కూడా మీడియాతో మాట్లాడుతూ కోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల తనకు చాలా ఆనందంగా ఉందని రాబోయే విచారణ గురించి మాత్రమే ఎదురు చూస్తున్నాను.. కానీ సిట్ విచారణ పైన కాస్త అసంతృప్తిగా ఉన్నది ఈ దర్యాప్తును చాలా రహస్యంగా చేస్తే బాగుంటుంది అంటూ తెలియజేసింది.. మీడియా వల్ల లీక్ అయితే ఇది నిందితులకు కూడా చాలా సహాయపడుతుంది అంటూ నటి తెలియజేసింది. ప్రస్తుతమైతే సిద్ధిఖి పరారీలో ఉన్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: