ఆచార్య ప్లాప్ తర్వాత.. చిరంజీవి కొరటాలకు ఏం మెసేజ్ పెట్టారో తెలుసా?

praveen
ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఒక సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. అదే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీ గురించి. ఈ సినిమా ఈ నెల 27వ తేదీన విడుదల కాబోతుంది అన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్లో తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటించింది. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం అటు అభిమానులు అందరూ కూడా ఎంతో ఆతృతంగా ఎదురుచూస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 ఇక ఈ సినిమాపై ఉన్న అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయ్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పాటలకి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో అందరూ చూశారు. ఇక ప్రస్తుతం తెలుగులో వరుసగా ప్రమోషన్స్ చేస్తూ చిత్ర బృందం బిజీబిజీగా ఉంది అని చెప్పాలి. అయితే ఇటీవల  ఒక ప్రెస్ మీట్ పెట్టగా.. అక్కడికి వచ్చిన జర్నలిస్టులందరూ కూడా డైరెక్టర్ కొరటాల శివను ఎన్నో రకాల ప్రశ్నలు అడిగారు. ఇందులో చిరంజీవితో తీసిన ఫ్లాప్ మూవీ ఆచార్య  గురించి కూడా కొరటాలకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే ఈ ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు కొరటాల.

 ఆచార్య ఫ్లాప్ తర్వాత మీపై ప్రెషర్ పెరిగిందా అంటూ ప్రశ్నించగా.. ప్రెషర్ ఏమీ లేదు ఆచార్య రిలీజ్ అయిన మూడవ రోజు నుంచి దేవర ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేశాను. కాకపోతే మరింత బాధ్యతగా పనిచేశాను అంటూ కొరటాల శివ సమాధానం చెప్పాడు. చిరంజీవి గారితో మీ బాండింగ్ ఎలా ఉంది. ఆచార్య మూవీ ఫ్లాప్ తర్వాత చిరంజీవి గారు ఏమన్నారు అంటూ ప్రశ్నించగా.. చిరంజీవి గారితో ఎప్పుడూ నా అనుబంధం బాగానే ఉంటుంది. ఆచార్య రిలీజ్ తర్వాత రిజల్ట్ చూసి యు విల్ బౌన్స్ బ్యాక్ స్ట్రాంగర్ శివ అని నాకు మెసేజ్ పెట్టిన మొదటి వ్యక్తి చిరంజీవి గారే అంటూ కొరటాల శివ ఇంట్రెస్టింగ్ విషయాని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: