డిప్యూటీ సీఎం ప్రాయశ్చిత్త దీక్షపై నాగబాబు ట్వీట్..!

lakhmi saranya
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా బిజీ అయిపోయారు. పవన్ కళ్యాణ్ మాల వేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం తిరుమల లడ్డు వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా... లడ్డూ కల్తీ ఘటన గురించే మాట్లాడుకుంటున్నారు.
 తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. విజయవాడ ఇంద్రకీలాద్రి పై ఉన్న కనకదుర్గ దేవాలయంలో పవన్ మంగళవారం ఉదయం శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. డిప్యూటీ సీఎం ఫస్ట్ గుడి మెట్లను కడిగారు. అనంతరం మెట్లకు పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి... కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం పూర్తయ్యాక పవన్ మీడియాలో మాట్లాడారు. వైసిపి నేతలపై దారుణంగా మండిపడుతున్నారు. సనాతన ధర్మం జోలికి రాకండని, దీనికోసం ప్రాణాలు సైతం ఇవ్వడానికి రెడీ అని,
 కాగా సనాతన ధర్మంపై నూటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని ఫైర్ అయ్యారు. ఆయన్ను విమర్శించేవారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనతో వాగ్వాదానికి దిగుదామనుకుంటే పవన్ రెడీగా ఉన్నానని చెప్పారు. ఈ క్రమంలో తాజాగా పవన్ ప్రాయశ్చిత్త దీక్ష పై మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికపై ఓ ట్రీట్ చేశారు. 'జగన్మోహన్ రెడ్డి, ఆయన వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాన్ని పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్తం చేసి కడిగేస్తున్నారని ' నాగబాబు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసినా పలువురు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీ వాళ్లు దేనికి పనికి రాకుండా పోతారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: