మైత్రికి షాక్ ఇచ్చిన దేవర యూనిట్.. ఆ ఒక్కరినే ఎందుకు మిస్ చేశారు..?

Pulgam Srinivas
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కానుంది . ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా , కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు . ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కానుండగా , సెప్టెంబర్ 26 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ను కొన్ని ప్రదేశాలలో ప్రదర్శించబోతున్నారు . అలాగే రెండు తెలుగు రాష్ట్రాల లో కూడా ఈ సినిమాకు సంబంధించిన మిడ్ నైట్ ప్రీమియర్స్ ను కూడా ప్రదర్శించబోతున్నారు . అందులో భాగంగా కేవలం హైదరాబాద్ నగరంలోనే 20 కంటే ఎక్కువ థియేటర్లలో ఈ సినిమాకు సంబంధించిన అర్ధరాత్రి షో లను నిర్వహించబోతున్నారు.

ఇకపోతే హైదరాబాద్ నగరంలో దేవర సినిమాకు సంబంధించిన అర్ధరాత్రి షో లను కేవలం సింగిల్ స్క్రీన్ లలో మాత్రమే ప్రదర్శించబోతున్నారు. మల్టీ ప్లెక్స్ థియేటర్లలో ఈ సినిమాకు సంబంధించిన అర్ధరాత్రి షో లను ప్రదర్శించడం లేదు. ఇకపోతే ఈ మధ్య కాలంలోనే మైత్రి సంస్థ వారు విమల్ థియేటర్ను నిర్మించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ థియేటర్ ను ఈ సంస్థ వారు ఆధ్యాత్మిక టెక్నాలజీతో రూపొందించారు.

ఇది సింగిల్ స్క్రీన్ థియేటర్. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లకు దేవర మూవీ అర్ధరాత్రి షో లకు పర్మిషన్స్ ఇస్తూ ఉండడంతో విమల్ థియేటర్ కి కూడా పర్మిషన్ ఇస్తారు అని చాలా మంది అనుకున్నారు. కానీ దేవర మూవీ కి సంబంధించిన అర్ధరాత్రి షో లు ఈ థియేటర్లలో పడడం లేదు. మరి చాలా థియేటర్లకు పర్మిషన్ ఇచ్చిన దేవర యూనిట్ మైత్రి సంస్థకు సంబంధించిన ఈ సినిమా థియేటర్ కి దేవర అర్ధరాత్రి షో లకు పర్మిషన్ ఇవ్వనట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: