ఎన్టీఆర్, ఏఎన్నార్ లనే భయపెట్టిన నటుడు.. ఆయనని చూస్తే చాలు?

praveen
ఎన్టీఆర్, ఏఎన్నార్.. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచిన గొప్ప నటుడు ఏకంగా తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్ళలాంటివారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంత గొప్ప ప్రస్థానాన్ని కొనసాగించారు కాబట్టి ఇప్పుడు వీరిద్దరూ ఈ లోకంలో లేకపోయినా ప్రేక్షకుల గుండెల్లో మాత్రం చెరగని ముద్ర వేసుకున్నారు. నటసార్వభౌముడిగా ఎన్టీఆర్ నట సామ్రాట్ గా ఏఎన్నార్ ప్రస్థానాన్ని కొనసాగించారు.

 ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇద్దరు లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమ లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ హీరోల ప్రస్తావన లేకుండా టాలీవుడ్ హిస్టరీ కూడా పూర్తవ్వదు అని చెప్పాలి. అయితే ఇంత గొప్ప ప్రస్థానాన్ని కొనసాగించారు కాబట్టే ఇక సినిమా షూటింగ్ సమయంలో సెట్ లో ఉన్న నటులందరూ వీరిని చూస్తే భయపడి పోయారు. వీరికి ఎదురుగా వెళ్లి మాట్లాడటానికి కూడా వెనకడుగు వేసేవారు. కానీ అలాంటి ఈ ఇద్దరు లెజెండరీ నటులను ఒక నటుడు భయపెట్టాడట. ఇక ఆ నటుడు సెట్ లో ఉన్నాడు అంటే చాలు పక్కనే కామ్ గా కూర్చునే వారట ఈ ఇద్దరు స్టార్ హీరోలు.

 ఏకంగా సినిమాలలో తమ పాత్రలను ఆయన ఎక్కడ డామినేట్ చేస్తాడో అని భయపడిపోయేవారట. ఇలాంటి లెజెండరీ నటలనే భయపెట్టిన ఆ నటుడు ఎవరో కాదు ఎస్వీ రంగారావు. ఆయనతో సీన్ చేయాలి అంటే ఎంతోసేపు ప్రిపేర్ అయ్యేంతవరకు కెమెరా ముందుకు వచ్చేవారు కాదట ఏఎన్ఆర్, ఎన్టీఆర్ లు. ఎక్కడ తమను అతను డామినేట్ చేస్తారో అని భయపడుతూ ఉండేవారట. అయితే ఎస్వీ రంగారావు తన నటనతో ఎన్ని గొప్ప పాత్రలకు ప్రాణం పోశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక సింగల్ టేక్ ఆర్టిస్ట్ గా కూడా ఆయనకు మంచి పేరు. అందుకే ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఎస్.వి.రంగారావుతో షూట్ అంటే చాలు భయపడి పోయారట. ఈ విషయాన్ని ఎవరో కాదు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో కైకాల సత్యనారాయణ ఓ సందర్భంలో వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: