మెంట‌లెక్కిస్తోన్న ' దేవ‌ర ' ప్ర‌మోష‌న్లు.. ఏకంగా సొర చేప‌తోనే..!

RAMAKRISHNA S.S.
టాలీవుడ్ యంగ్ టైగర్.. మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా.. అన్నిచోట్ల కూడా ఎన్టీఆర్ కు ప్రత్యేకంగా అభిమాన జనం ఉన్నారు. తన తాత సీనియర్ ఎన్టీఆర్ నుంచి నందమూరి కుటుంబానికి ఉన్న అభిమానులు కూడా ఎన్టీఆర్‌ను ఎంతో అభిమానిస్తూ ఉంటారు. త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర. రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతున్న దేవర.. తొలి భాగం ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ తనకి ఉన్న కల్ట్ అభిమానులు.. మన టాలీవుడ్ లో డిఫరెంట్ లెవెల్ లో ఫ్యానిజాన్ని చూపిస్తారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో త్రిబుల్ ఆర్ సినిమాకి కూడా ఏకంగా విమానాలతో ప్రమోషన్లు చేశారు. ఈసారి ఎన్టీఆర్ నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియ‌న్‌ సినిమా దేవర కోసం అదే తరహా ప్రమోషన్లు చేస్తున్నారు. నీటి నేపథ్యంలో దేవర తెరకెక్క‌టం పైగా ఈ సినిమాలో సోర‌చేపపై సన్నివేశాలు ఉండడంతో.. ఎన్టీఆర్ అభిమానులు ఏకంగా నీటి లోపల.. అది కూడా సొర చేపల మధ్యలో దేవర పోస్టర్స్ వేసి.. మెంటల్ మాస్ ఫ్యానిజ్ చూపిస్తున్నారు.

అభిమానం చూపించే విషయంలో తమకు తామే సాటి.. తమకు ఎవరూ లేరు పోటీ అన్నట్టుగా నిరూపించుకున్నారు. దీంతో ఈ విజువల్స్ చూసిన ఇతర హీరోల అభిమానులు సైతం.. షాక్ అయిపోతున్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ అభిమానులు దేవర ప్రమోషన్ల విషయంలో అదరగొట్టేసారు అని చెప్పాలి. నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: