రాజశేఖర్ ఎన్ని బ్లాక్ బస్టర్ మూవీలలో విలన్ పాత్రలను రిజెక్ట్ చేశాడో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన సీనియర్ హీరోలలో రాజశేఖర్ ఒకరు. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం వరుస విజయాలను అందుకుంటు ఏకంగా టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ స్థాయిలో కెరియర్ను కొనసాగించాడు. ఇక ఆ తర్వాత ఈయనకు వరుసగా అపజయాలు దక్కాయి. దానితో ఈయన కెరీర్ గ్రాఫ్ చాలా వరకు పడిపోయింది. ఈ మధ్య కాలంలో ఈయన సినిమాలు చేస్తున్న అందులో ఏది కూడా గొప్ప విజయాన్ని అందుకోవడం లేదు. ఇది ఇలా ఉంటే ఈయన ఈ మధ్య కాలంలో రెండు సినిమాలలో విలన్ పాత్రలను వదులుకున్నాడు. ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించాయి. అలాగే ఈయన రిజెక్ట్ చేసిన పాత్రలకు కూడా సూపర్ గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

కొంత కాలం క్రితం అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సన్నాఫ్ సత్యమూర్తి అనే మూవీ వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ఉపేంద్ర ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ పాత్ర కోసం మొదట ఈ మూవీ బృందం రాజశేఖర్ ను సంప్రదించిందట. కానీ ఈయన మాత్రం ఆ సినిమా చేయలేను అని చెప్పాడట. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇకపోతే కొంత కాలం క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధ్రువ అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో అరవింద స్వామి విలన్ పాత్రలో నటించాడు. ఈ పాత్ర కోసం మొదట ఈ మూవీ బృందం వారు రాజశేఖర్ ను సంప్రదించిందట. కానీ ఈయన మాత్రం ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశాడట. ఇలా రాజశేఖర్ ఈ మధ్య కాలంలోనే రెండు సినిమాలలో ఆఫర్లను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: