"దేవర" రికార్డుల విషయంలో మరో మైల్ స్టోన్ ఇదే!

Suma Kallamadi
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా, దర్శకుడు కొరటాల శివ తీసిన పాన్ ఇండియా చిత్రం “దేవర” మరికొన్ని గంటల్లో రిలీజుకి ఉండడంతో ఫాన్స్ ఈ సినిమాకోసం చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కొన్ని గంటల్లోనే బిగ్ స్క్రీన్స్ పై చిత్రం పడనుండగా యూఎస్ మార్కెట్ లో అయితే 26 సాయంత్రం నుంచే షోస్ పడిపోనున్నాయని టాక్ నడుస్తోంది. ఇప్పటికే యూఎస్ మార్కెట్లో దేవర రికార్డు బుకింగ్స్ ని 'ప్రీ సేల్స్' రూపంలో నమోదు చేస్తుండగా లేటెస్ట్ గా ఈ సినిమా మరో భారీ మైల్ స్టోన్ ని కేవలం ప్రీ సేల్స్ తోనే అందుకున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.
విషయం ఏమిటంటే? ఈ చిత్రం ఇపుడు రికార్డు మైల్ స్టోన్ 2.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని కూడా దాటేసింది అని ట్రేడ్ వర్గాలు తాజాగా వెల్లడించాయి. దీనితో  దేవర సెన్సేషన్ ఏ లెవెల్లో ఉందో అర్ధం అవుతోంది. ముఖ్యంగా ఈ పీరియాడికల్ చిత్రానికి అనిరుద్ నేపధ్య సంగీతం చాలా హైలెట్ గా నిలవనుందని సమాచారం. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా రికార్డు స్థాయిలో భారీ స్క్రీన్స్ పైన ప్రదర్శింప బడుతున్నట్టు కూడా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని క్లైమాక్ ఫైట్ సినిమాకే హైలెట్ కానుందని అంటున్నారు. షార్కుతో ఎన్టీఆర్ చేసిన ఫైట్ ఒక అద్భుతంగా నిలవనుందని ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతోంది.


ఇకపోతే కొన్ని గంటల్లోనే విడుదల కాబోతున్న చిత్రం కావున, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అభిమానులు థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నారు. ఎన్టీఆర్ బేనర్లకు, కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇక కొన్ని చోట్ల అయితే బేనర్లు కట్టడానికి అభిమానులు తన్నుకున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక మొన్నటికి మొన్న క్యాన్సిల్ అయిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ అభిమానులు చేసిన రచ్చ గురించి తెలిసినదే. ఈవెంట్ రద్దు కావడంతో ఫాన్స్ హైదరాబాద్ నోవాటిల్ ప్రాంగణాన్ని ధ్వంసం చేసారు. దాంతో సదరు హోటల్ నిర్వాహకులు చిత్ర బృందానికి 35 లక్షలు ఫైన్ వేసిన సంగతి కూడా తెలిసినదే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: