ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో కార్తీ.. ఇక బాక్సాఫీస్ బద్దలే?

praveen
ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండు కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు దర్శకులు కేవలం సినిమాలను మాత్రమే తెరకెక్కించేవారు. ఆ సినిమాకి వారి తర్వాత సినిమాకి పెద్దగా లింక్ ఉండేది కాదు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఏకంగా తమకంటూ ఒక యూనివర్స్ క్రియేట్ చేసుకుని అందులో సినిమాలు చేస్తూ ఉన్నారు. ఒక సినిమాకి మరో సినిమాకి లింకు పెడుతూ ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకేత్తిస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో హీరోలు కూడా ఇలాంటి సినిమాలు చేయడానికి తెగ ఇష్టపడిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కన్నడలో లోకేష్ కనకరాజు ఇలాంటి సినిమాటిక్ యూనివర్స్ ని మొదలుపెట్టి ఇప్పటికే పలు సినిమాలను కూడా తీశారు.

 అయితే అటు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఇలా సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి అందులో సినిమాలు తీస్తూ ఉన్నాడు. మొన్నటికి మొన్న హనుమాన్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ తర్వాత ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయాడు ప్రశాంత్ వర్మ. అందరి దృష్టి కూడా అతనిపై పడింది. దీంతో ఈ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి అనే విషయాన్ని తెలుసుకునేందుకు కూడా ప్రేక్షకులు  ఆసక్తిని కనబరుస్తున్నారు అని చెప్పాలి.

 అయితే ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోకి ఒక క్రేజీ స్టార్ హీరో వచ్చి చేరాడు అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ హీరో ఎవరో కాదు కార్తీ. కార్తీ ప్రధాన పాత్రలో నటించిన సత్యం సుందరం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఇటీవలే ప్రశాంత్ వర్మ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో హీరో కార్తీని నటించాలని కోరినట్లు డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే కథ కూడా చెప్పానని.. కానీ ఆయన నుంచి రెస్పాన్స్ రాలేదు అంటూ తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ఇక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో కి కార్తీ వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: