షాక్: హాస్పిటల్లో చేరిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. షాక్ లో ఫ్యాన్స్..!

Divya
చాలామంది సినీ సెలబ్రిటీలు ఈ మధ్యకాలంలో సడన్గా హాస్పిటల్ లో కనిపిస్తూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు.. నిన్నటి రోజున బాహుబలి చిత్రంలో స్పెషల్ సాంగ్ లో కనిపించిన నోరా ఫతెహి హాస్పిటల్ బెడ్డు పైన నడవలేని పరిస్థితిలో కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కూడా హాస్పిటల్లో సెలైన్ బాటిల్ ఎక్కించుకున్నట్టుగా ఒక ఫోటోని సైతం విడుదల చేయడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

తెలుగు ,తమిళం భాషలలో మంచి క్రేజీ సంపాదించుకున్న ఐశ్వర్య లక్ష్మి మలయాళ సినీ ఇండస్ట్రీలో కూడా పలు చిత్రాలలో నటించింది. తెలుగు సినీ పరిశ్రమకు గాడ్సే అనే చిత్రం ద్వారా పరిచయమైంది. తెలుగులో నటించిన తక్కువ సినిమాలే అయినా తన అందంతో గ్లామర్ తో బాగానే ఆకట్టుకుంది. అలాగే ఎన్నో పాన్ ఇండియా చిత్రాలలో కూడా నటించిన ఐశ్వర్య లక్ష్మి.. మట్టి కుస్తీ, కింగ్ ఆఫ్ కోత వంటి చిత్రాలతో ఇటీవలే ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. తాజాగా ఐశ్వర్య లక్ష్మి అనారోగ్యానికి సంబంధించిన కొన్ని ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ ఫోటోలలో ఐశ్వర్య లక్ష్మి కాస్త ఎమోషనల్ గా కనిపిస్తోంది. హాస్పిటల్ బెడ్డు పైన తన చేతికి బ్యాండేజ్ ఉన్నట్టుగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఐశ్వర్య లక్ష్మి.. ఇవే కాకుండా మరికొన్ని స్టైలిష్ ఫోటోలను కూడా షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ తన అనారోగ్యానికి గల కారణం ఏంటనే విషయం మాత్రం తెలియజేయలేదు. ఐశ్వర్య లక్ష్మి ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే హలో మమ్మీ అనే సినిమా మలయాళంలో నటిస్తోంది ఈ సినిమా పూర్తి అయింది.. అలాగే థగలైఫ్  అనే సినిమాలో కూడా నటిస్తోంది. తెలుగులో SDT -18  సాయిధరంతేజ్ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: