మళ్లీ అదే తప్పు చేస్తున్న ప్రభాస్.. వద్దంటే వినట్లేదుగా..!?

Amruth kumar
మన భారతీయ చిత్ర పరిశ్రమలో రామాయణం ఆధారంగా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు, సీరియల్స్ వచ్చాయి. ఎన్ని వచ్చినా మళ్ళీ మళ్ళీ రాముడు చరిత్రనే చూడడానికి ప్రేక్షకులు ఇప్పటికీ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే రామాయణం ఆధారంగా ఎప్పటికీ సినిమాలు చేయడానికి దర్శకులు నిర్మాతలు రెడీ అవుతున్నారు.  అయితే బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా వచ్చిన ఆదిపురుష్‌ మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించాడు.
 రాముడు గా ప్రభాస్ ని ప్రజెంట్ చేసిన విధానం అసలు బాగోలేదని ఎప్పటికీ విమర్శలు వస్తున్నాయి. అలాగే  కథని పూర్తిగా వక్రీక‌రించి ఇష్టం వచ్చినట్టుగా తెర్కెక్కించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆదిపురుష్‌ సినిమాని ప్రేక్షకులు కూడా యాక్సెప్ట్ చేయలేకపోయారు. దీంతో ఈ మూవీ అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ మూవీ కారణంగా ప్రభాస్ ఇప్పటికి ట్రోలింగ్కి గురవుతున్నాడు.
అయితే ప్రభాస్ మరోసారి రామాయణం జోలికి వెల్లడు అని అందరూ అనుకున్నారు. కానీ ఈ పాన్ ఇండియా హీరో మరోసారి రామాయణంలో నటించబోతున్నాడనే ప్రచారం బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్లో నితీష్ తివారి దర్శకత్వంలో రణ‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా రామాయణం మూవీ ఇప్పటికే  షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీలో పరశురాముడు పాత్ర కోసం ప్రభాస్ ను కలిసినట్టు తెలుస్తుంది.
ప్రభాస్ కూడా ఈ మూవీలో నటించడానికి ఓకే చెప్పే అడా లేదా అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు.  త్వరలోనే ఈ క్యారెక్టర్ కు సంబంధించిన అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందని బీ టోన్ మీడియాలో వినిపిస్తుంది. ఆదుపురుష్‌ సినిమా ప్లాప్ తో ప్రభాస్ రామాయణం వంటి చరిత్రల సినిమాల్లో నటించవద్దని అభిమానులు కోరుకుంటున్నారు. దర్శకుల అవగాహన లోపం కారణంగా హీరోగా చేసిన ప్రభాస్ తర్వాత ప్రేక్షకుల నుంచి ట్రోలింగ్కు గురవుతూ తన క్రేజీని తగ్గించుకుంటున్నాడు. ఇప్పుడు పరశురాముడిగా ప్రభాస్ చేస్తే ఆదిపురుష్ లానే ఆయనకు నెగిటివిటీని పెంచుతుందని అభిమానులు వాపోతున్నారు. ఇక మరి ప్రభాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: