దేవర గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కార్తికేయ.. మరి ఇంతలానా..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజా గా దేవర అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ ఈ రోజు సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తం గా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది . ఇక పోతే ఈ సినిమాను చూడడాని కి ఎన్టీఆర్ అభిమానుల తో పాటు మామూ లు సినీ ప్రేమికులు మాత్రమే కాకుండా సినీ పరిశ్రమకు సంబంధించిన ఎంతో మంది కూడా చాలా రోజులు గా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
 

ఇక ఈ మూవీ విడుదల అయింది. చాలా చోట్ల నుండి ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. తాజాగా ఎస్ ఎస్ రాజమౌళి తనయుడు అయినటువంటి ఎస్ ఎస్ కార్తికేయ ఈ సినిమాను చూసినట్లు సినిమా పట్ల తన అనుభవాన్ని X వేదికగా పంచుకున్నాడు. ఆయన సోషల్ మీడియా వేదికగా దేవర మూవీ గురించి స్పందిస్తూ ... 23 సంవత్సరాల పురాణం. చివరకు అదే రోజున మనిషి స్వయంగా ప్రారంభించిన చోట అది విచ్ఛిన్నమైంది. ఆయన్ను దగ్గరి నుంచి చూస్తూ పెరగడం , ఇప్పుడు ఆయన అద్భుతాలకు సాక్షులు కావడం తెలుగు సినిమాకు ఆయన ప్రత్యేకత. పూర్తిగా మాటలు లేని.

ఇది చెప్పడానికి నేను అరిచాను. అభిమానులందరికీ.. ఇది మనం జరుపుకోవడానికి ఆయన ఇచ్చిన బహుమతి. దేవర - సినిమాల్లో అతిపెద్ద మాస్ సెలబ్రేషన్. మరి ఇప్పుడు పిచ్చి కూడా మాట్లాడుతుంది. అందరూ పులికి వందనం. అంటూ రాసుకు వచ్చాడు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కార్తికేయ చేసిన ఈ పోస్ట్ అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: