దేవర రిజల్ట్ తో టెన్షన్లో మహేష్ ఫ్యాన్స్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు . ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించగా అందులో అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి . ఇక ఈయన సినిమాలలో హీరోగా నటించిన వారికి అద్భుతమైన స్థాయిలో క్రేజ్ వస్తూ ఉంటుంది. అలా క్రేజ్ వస్తుంది కానీ ఈయన సినిమాలలో హీరోగా నటించిన తర్వాత ఏ హీరోకు కూడా ఇప్పటి వరకు విజయం దక్కలేదు. ఇది ఇలా ఉంటే రాజమౌళి ఆఖరుగా ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకొని ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. వీరిద్దరికీ ఈ సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ "ఆచార్య" సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ భారీ డిజాస్టర్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమాకు కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. ఇకపోతే రాజమౌళి తన తదుపరి మూవీ ని మహేష్ బాబు తో చేయబోతున్నాడు. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కానుంది. ఇక ఈ మూవీ తో మహేష్ బాబు కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ వస్తుంది అని మహేష్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ రాజమౌళి సినిమా తర్వాత మహేష్ కు సక్సెస్ దక్కుతుందా లేదా అని వారు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: