కొరటాల పెద్ద ప్లాన్.. జాన్వి ని తీసుకుంది అందుకే..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో కొరటాల శివ ఒకరు. ఈ దర్శకుడు ఇప్పటి వరకు మిర్చి , శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను , ఆచార్య దేవర పార్ట్ 1 మూవీలకు దర్శకత్వం వహించాడు. ఇందులో మిర్చి , శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోగా , ఆచార్య మూవీ మాత్రం భారీ అపజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇక దేవర పార్ట్ 1 మూవీ నిన్ననే థియేటర్లలో విడుదల అయింది.

ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ వచ్చిన కూడా ఈ మూవీ మొదటి రోజు మాత్రం అదిరిపోయే సూపర్ సాలిడ్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది. ఈ మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో జాన్వి కపూర్ పాత్ర ఎంతో ప్రాధాన్యతను సంచరించుకొని ఉంటుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈమె పాత్ర మాత్రం చాలా తక్కువ ప్రాధాన్యతతో సాగింది. ఒక పాట , రెండు , మూడు సన్నివేశాలతో ఈమె పాత్రను ముగించేశారు. ఇక దానితో జాన్వీ కి ఈ మూవీ ద్వారా తెలుగు లో అత్యంత అద్భుతమైన క్రేజ్ వస్తుంది అనుకున్న వారి అంచనాలు అన్ని తారుమారయ్యాయి. కానీ కొరటాల ఇది ఒక స్ట్రాటజీ ప్రకారమే చేశాడు అని మరి కొంత మంది అంటున్నారు.

అదేమిటి అంటే జాన్వి పాత్రను మొదటి భాగంలో చాలా తక్కువ వాడుకొని రెండవ భాగంలో ఎక్కువ స్కోప్ ఇవ్వాలి అనే ఉద్దేశం తోనే మొదటి భాగంలో ఈమె పాత్రను తక్కువ చూపించాడు అని , రెండవ భాగంలో జాన్వీ పాత్రకు చాలా స్కోప్ ఉంటుంది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీతోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు తరపు పరిచయం అయింది. ఈ సినిమాలో ఈమె తన నటన కంటే కూడా అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: