జాన్వీ, ఆలియాల‌ను టాలీవుడ్‌లో మోసం చేసిందెవ‌రు... అస‌లేం జ‌రిగింది..?

RAMAKRISHNA S.S.
పాన్ ఇండియా సినిమా అంటూ తెలుగు సినిమా ఆఫర్లు వస్తే ఇకపై బాలీవుడ్ హీరోయిన్లు భయపడతారు అని చెప్పాలి. ఒకటికి మూడుసార్లు ఆలోచించుకుని కానీ తెలుగు సినిమాలు ఒప్పుకోరు. మొన్నటికి మొన్న రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల్ ఆర్ సినిమా అనగానే ఆలియా భ‌ట్ ఎగిరి గంతేసి ఒప్పుకుంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ దేవర పాన్ ఇండియా సినిమా అనగానే శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ కూడా ఒప్పుకుంది. ఈ ఇద్దరు హీరోయిన్లు భారీ ఆశలతో టాలీవుడ్ లో అడుగు పెట్టారు.

వీరి ఆశ‌లు మాత్రం అడియాస‌లు అయ్యాయి. తెలుగు హీరోల హీరోయిజం ముందు వీరు తుస్సుమ‌న్నారు.  రాజమౌళి దర్శకుడు అనగానే మరో ఆలోచన లేకుండా వెంటనే ఒప్పుకుంది ఆలియా భట్ .. పైగా రాంచరణ్ కు జోడిగా నటించింది. తీరా సినిమాలో చూస్తే ఆమెకు గట్టిగా నాలుగు సీన్లు కూడా లేవు. ఇందుకోసం ఆమెకు భారీగా ముట్ట చెప్పారు. అయితే ఆలియా భట్‌ పాత్ర ఆమె సౌత్ ఇండియా ... టాలీవుడ్ కెరీర్ కు ఎంత మాత్రం ఉపయోగ పడలేదు. తాజాగా దేవర సినిమాలో జాన్వి కపూర్ పాత్ర కూడా ఆమె టాలీవుడ్ ఎంట్రీ కి ఎంత మాత్రం ఉపయోగం లేకుండా పోయింది.

జాన్వి పాత్ర గెస్ట్ రోల్ కంటే కాస్త ఎక్కువ ఉంటుంది .. పైగా ఓ సాంగు కూడా తీసేయడంతో ఆమె స్క్రీన్ టైం పూర్తిగా తగ్గిపోయింది. ఇందుకోసం ఆమెకు అయిదు కోట్లు రెమ్యున‌రేష‌న్‌ ఇచ్చారని టాక్‌. ఇదే కనుక నిజమైతే అంత రెగ్యునరేషన్ వేస్ట్ .. డబ్బు సంగతి పక్కన పెడితే జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కి ఏ మాత్రం పనికిరాని సినిమాగా దేవర వన్ నిలిచిపోయింది. నిజం చెప్పాలంటే జాన్వి - ఆలియాలను కొరటాల శివ - రాజమౌళి ఎంతో నమ్మించి మరి మోసం చేశారని చెప్పాలి. బాలీవుడ్ హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయాలంటే చాలా జాగ్రత్తతో తమ పాత్ర ఏంటి అన్నది ఒప్పుకున్నాక కానీ ఓకే చెప్పరు ఏమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: