తెలంగాణలో రాజస్థాన్ సెట్.. హైప్స్ పెంచేస్తున్న బాలయ్య సినిమా..?

Suma Kallamadi
నటసింహం నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మరో యాక్టింగ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై నెక్స్ట్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ గురించి కొన్ని లీవ్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. హాలీవుడ్ రేంజ్ లో ఇందులో యాక్షన్ ఎపిసోడ్ ఒకటి ఉందని, ఇదే ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ కాబోతుందని కొంతమంది అంటున్నారు. ఇక ఇంటర్వెల్‌లో వచ్చే ఒక సీన్ కూడా మూవీని, బాలయ్య బాబును బాగా ఎలివేట్ చేస్తుందట. ఈ అన్ని రూమర్స్ నడుమ బాలకృష్ణ బాబీ కాంబో మూవీకి సంబంధించి ఒక రియల్, క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది.

 అదేంటంటే ఈ సినిమా కోసం ఎడారి ప్రాంతం.. రాజస్థాన్‌లోని పల్లెటూరును తలపించేలా ఓ సినిమా సెట్‌ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లాలో! ఈ జిల్లాలోని చౌటుప్పల్‌ మండలంలో దండుమల్కాపురం ఊరు ఉంది. దీనికి సమీపంలోనే ఓ ఇండస్ట్రియల్ పార్కు కూడా ఉంది. సరిగ్గా దీని పక్కనే హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని ఆనుకొని రాజస్థాన్ సెట్ అద్భుతంగా వేశారు. ఆ సెట్ కు సంబంధించిన ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి వాటిని చూసి బాలకృష్ణ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఎడారిలో రక్తపుటేరులు బాలకృష్ణ పారిస్తారా అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ సెట్స్ లో పూరి గుడిసెలు ఇంకా ఎడారి ప్రాంతంలో ప్రజలు నిర్మించుకునే ఇతర ఇళ్లు ఉన్నాయి.

నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్ కోసం ఇరవై రోజుల క్రితమే దీన్ని ఏర్పాటు చేశారు. ఐదు రోజుల పాటు సినిమా షూటింగ్ చేయడం కూడా జరిగిపోయింది. ఇక ఇందులో హీరో బాలకృష్ణ సరసన నాజూకు హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌ నటిస్తోంది. కె.ఎస్‌.రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని బాలకృష్ణ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హీరో, హీరోయిన్‌లపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయడం జరిగిందని సమాచారం. అక్టోబరు మొదటి వారంలో షూటింగ్‌ రీస్టార్ట్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: