స్టార్ హీరోయిన్లకు వణుకు పుట్టిస్తున్న సెలబ్రిటీ డాటర్స్.. ఎవరంటే..?

Divya
రోజా చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీల మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ మధుబాల జాతీయ ఉత్తమ నటిగా కూడా పేరు సంపాదించింది. ఈమె తెలుగు, తమిళం వంటి చిత్రాలలో నటించింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ తన వారసత్వాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మధుబాలకు ఇద్దరు కూతుర్లు కాగ ఇద్దరు కూడా హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. 1999లో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ షాను వివాహం చేసుకున్నది. వీరికి కీయాషా, ఆమేయేషా అనే ఇద్దరు కూతుర్లు జన్మించారు.

వీరిద్దరు కూడా తన తల్లికి తగ్గట్టుగానే మరింత అందంగా కనిపిస్తూ ఉన్నారు.. అయితే ఈ ఇద్దరు కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా హీరోయిన్స్ గా ఎదగడం ఖాయమని ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ కు దీటుగా పోటీలో నిలుస్తారని పలువురు అభిమానులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మధుబాల పెద్ద కుమార్తె అచ్చం తన తల్లి మాదిరిగానే కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఈ ఇద్దరు కూతుర్లు అకాడమీ స్టడీస్ ని పూర్తి చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో వీరికి సంబంధించి కొన్ని ఫోటోలను మధుబాల షేర్ చేయక అవి వైరల్ గా మారుతున్నాయి.

ఈ మధ్యకాలంలో మధుబాల కూడా రీయంట్రి ఇచ్చి పలు చిత్రాలలో నటిస్తున్నది. రోజా చిత్రంతో అప్పట్లోనే పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా ఒక సంచలనం సృష్టించింది. ఆ తర్వాత జెంటిల్మెన్, యోధ తదితర చిత్రాలలో కూడా నటించింది.ఇక రీ ఎంట్రీలో కూడా తలైవి, శాకుంతల వంటి చిత్రాలలో నటించిన ఇమే ప్రస్తుతం మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప చిత్రంలో కూడా ఒక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా మధుబాల తన ఇద్దరి కూతుర్ల ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: