ఆ రెండు సినిమాల విషయంలో టెన్షన్లో పవన్ ఫ్యాన్స్.. భారం అంతా ఆదర్శకుడి పైనే..?

MADDIBOINA AJAY KUMAR
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం హరిహర వీరమల్లు , ఉస్తాద్ భగత్ సింగ్ , ఓజీ ఇలా ఈ మూడు సినిమాలకు కమిట్ అయ్యి కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత పవన్ రాజకీయాలపై దృష్టిలో పెట్టాడు. దానితో ఈ మూడు సినిమాల షూటింగ్ ఆగిపోయింది. మరీ ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమాను మొదలు పెట్టి చాలా కాలం అవుతుంది. ఈ సినిమా మొదలు పెట్టిన తర్వాత పవన్ కొన్ని సినిమాలను కూడా పవన్ పూర్తి చేశాడు. కానీ ఈ మూవీ మాత్రం పూర్తి కాలేదు. దానితో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో స్టార్ట్ అయిన ఈ సినిమా నుండి క్రిష్ జాగర్లమూడి తప్పుకున్నాడు.

దానితో రూల్స్ రంజన్ మూవీ దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ సినిమా యొక్క దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నాడు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నాడు. ఇలా చాలా కాలం డీలే అవుతూ రావడంతో చాలా మంది జనాలు ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకోలేదు. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ ని చాలా కాలం క్రితం ప్రారంభించాడు. ఈ మూవీ తేరి అనే తమిళ సినిమాకు రీమేక్. ఈ మూవీ ఇప్పటికే తెలుగు లో పోలీసోడు అనే పేరుతో విడుదల కూడా అయింది.

దానితో ఇప్పటికే తెలుగు లో వచ్చేసిన సినిమా కాబట్టి ఈ మూవీ పై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. ప్రస్తుతం పవన్ , సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే మూవీ లో నటిస్తున్నాడు. ఈ మూవీ ఫ్రెష్ స్టోరీ తో రూపొందుతుంది. దానితో ఈ సినిమాపై పవన్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో పవన్ కు భారీ బ్లాక్ బాస్టర్ విజయం దక్కుతుంది అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: