నా ఫ్యాన్స్ ని అందుకే కొడతా.. బాలయ్య షాకింగ్ కామెంట్స్..!!

murali krishna
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం NBK 109 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాబీ డైరక్షన్ లో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ కథాంశంతో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమాలోని కీలక సీక్వెన్స్ కోసం రాజస్తాన్ లోని పల్లెటూరును తలపించేలా చౌటుప్పల్ మండలంలో వేసిన సెట్ ఆకట్టుకుంటోంది.ఈ నేపథ్యంలోఆరు పదుల వయసులో కూడా.. తన సూపర్ ఎనర్జీతో ఆకట్టుకుంటున్నారు బాలకృష్ణ. ఈ మధ్యనే బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీ ఆ ఫంక్షన్ ని ఎంతో అంగరంగ వైభవంగా జరిపిన సంగతి తెలిసిందే. కాగా తెలుగు ఇండస్ట్రీ తో పాటు ఐఫా అవార్డుల్లో సైతం. బాలకృష్ణకి అరుదైన గౌరవం దక్కింది. అబుదాబి వేదికగా జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో బాలయ్య కు గోల్డెన్ లెగసీ అవార్డు దక్కింది. ఆ అవార్డును అందుకునేందుకు గాను అక్కడకి వెళ్లిన బాలకృష్ణ స్టేజ్ పై సందడి చేశారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లు కలిసి స్టేజ్‌ ను షేర్ చేసుకున్న ఫోటోలు వైరల్‌ అయ్యాయి. అవార్డ్‌ వేడుక సందర్భంగా రెడ్‌ కార్పెట్‌ పై బాలకృష్ణ మాట్లాడుతూ గోల్డెన్ లెగసీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. మరో పాతిక సంవత్సరాల పాటు హీరోగానే సినిమాలు చేస్తానంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా మోక్షజ్ఞ కి సైతం పోటీగా నేను సినిమాలు చేస్తాను అన్నట్లుగా బాలయ్య పేర్కొన్నారు.
 నందమూరి బాలకృష్ణ మీడియా ముందు మాట్లాడితే సంచలనం. ఆయన ఏం మాట్లాడినా నో ఫిల్టర్ అన్నట్లుగా ఉంటుంది. జాగ్రత్తగా మాట్లాడాలి, ఎవరు ఏం అనుకుంటారో, ఎవరైనా ఏమైనా ఫీల్ అవుతారో అని బాలయ్య అస్సలు ఆలోచించరు. మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం ఆయనకు అలవాటు.

అదే తాజాగా మరోసారి అదే చేశారు.ఈ సారి మీడియా ముందు కాదు, ఐఫా అవార్డ్స్ స్టేజి పై. ఐఫా అవార్డుల వేడుకలో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ బాలయ్యని ఆసక్తికర ప్రశ్న అడిగారు. అంతా మిమ్మల్ని చూసి ఎందుకు భయపడతారు అని ప్రశ్నించారు. బాలయ్య నవ్వుతూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఫ్యాన్స్ నన్ను అమితంగా ప్రేమిస్తారు. నేను కూడా వాళ్ళ పట్ల ప్రేమ చూపిస్తాను. కొన్నిసార్లు అభిమానుల ప్రేమ శృతి మించుతుంది. చిరాకు తెప్పిస్తారు. అలాంటప్పుడు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ తప్పదు అంటూ బాలయ్య తెలిపారు.రిటర్న్ గిఫ్ట్ అంటే బాలయ్య దృష్టిలో చెంపదెబ్బ. చాలా సందర్భాల్లో బాలయ్య ఫ్యాన్స్ ని కొట్టిన దృశ్యాలు బాగా వైరల్ అయ్యాయి. తాజాగా తాను ఫ్యాన్స్ ని కొడతాననే విషయాన్ని అంగీకరించారు. బాలయ్యకి మరో ప్రశ్న కూడా ఎదురైంది. జై బాలయ్య అనే నినాదాన్ని మొట్ట మొదటి సారి ఎప్పుడు విన్నారు అని ప్రశ్నించారు. దీనికి బాలయ్య ఇచ్చిన సమాధానం కాస్త వింతగానే ఉంది. నేను అభిమన్యుడి టైపు.. తల్లి గర్భంలో ఉన్నప్పుడే జై బాలయ్య నినాదాన్ని విన్నానని చెప్పడం కాస్త విడ్డూరమే. బాలయ్య సరదాకి చెప్పినా ఇది కాస్త ఓవర్ గా ఉందని అంటున్నారు. జై బాలయ్య అనే నినాదం బాగా ఫేమస్ అయిపోయింది. చాలా చోట్ల ఫ్యాన్స్ జై బాలయ్య అంటూ గట్టిగా కేకలు పెడుతూ అరవడం చూస్తూనే ఉన్నాం.అలానే తాను చేస్తున్న అన్ష్టాపబుల్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉండే పాపులర్ షోస్ లో 18 వ స్థానంలో ఉందని.. సగర్వంగా చెప్పుకొచ్చారు బాలయ్య. ఇందుకు సంబంధించిన వీడియోలు‌‌.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇప్పటికే యన్ బి కే 109 మూవీ ఐదు రోజుల పాటు సినిమాను చిత్రీకరించారు. మధ్యలో ఐఫా అవార్డ్స్ కోసం బాలయ్య అబుదాబీ వెళ్లారు. అక్టోబరు మొదటి వారంలో షూటింగ్‌ పునఃప్రారంభం కానుంది.ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ , ఫార్చూన్‌ ఫోర్‌ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో.. యానిమల్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బాబీ డియోల్‌ విలన్‌ గా నటిస్తుండగా..బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్‌ ఫీ మేల్‌ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఎన్‌బీకే 109లో ఊర్వశి రౌటేలా పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: