మ‌హేష్‌బాబు - కార్తీ మ‌ల్టీస్టార‌ర్ ఫిక్స్‌...!

RAMAKRISHNA S.S.
- గుంటూరు కారంతో సంక్రాంతికి సంద‌డి చేసిన మ‌హేష్ . . !
- రాజ‌మౌళి తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు రెడీ .. !
- మ‌హేష్ తో మ‌ల్టీస్టార‌ర్ పై కార్తీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు .. !
- చిన్న‌ప్పుడు క‌లిసి చ‌దువుకున్నామ‌ని ట్విస్ట్ ఇచ్చిన కార్తీ .. !
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సంక్రాంతి కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో వచ్చిన గుంటూరు కారం సినిమా లో నటించారు. ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమా కోసం గత రెండు సంవత్సరాలుగా ఎంతో కష్టపడుతున్నారు . ఈ సినిమాలో మహేష్ బాబు తో పాటు అనేకమంది బిగ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు. ఇక మహేష్ బాబు గతంలో పలు మల్టీ స్టార్లర్ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో కలిసి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలో మహేష్ నటించారు.

అలా మహేష్తో మల్టీస్టారర్ సినిమాపై కోలీవుడ్ కార్తీక్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కి ఇప్పుడు వైరల్ గా మారాయి. కార్తి తాజాగా సత్యం సుందరం లాంటి ఎమోషనల్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను కూడా కదిలించాడు. ఇక తాజాగా కార్తీ మాట్లాడుతూ మహేష్ బాబు తాను చిన్నప్పుడు ఒకే తరగతిలో చదువుకున్నామని ... మహేష్ తో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని ... అందుకు మంచి కథ కుదరాలి అంటూ కార్తి తెలిపాడు. కార్తీ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తో ఎప్పుడు మహేష్ బాబు - కార్తీ కలయికలో సినిమా వ‌స్తే అదిరిపోతుంద‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: