భార్యతో గోవాలో ఎంజాయ్ చేసిన పుష్ప... మెగా ఫ్యామిలీలో ఒక్కరుంటే ఒట్టు?

Suma Kallamadi
సెప్టెంబర్ 29న అల్లు అర్జున్ భార్య స్పేహారెడ్డి పుట్టిన రోజు కావడం చేత అల్లు వారి అబ్బాయి, భార్య పుట్టిన రోజు వేడుకలను గోవాలో ఆరెంజ్ చేశాడు. కాగా ఆమె పుట్టిన రోజు సందర్భంగా మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరంటే ఒక్కరూ కూడా ఆమెకు విషెష్ తెలియజేయలేదు. అది మాత్రమే కాకుండా, స్పేహారెడ్డి ఇచ్చిన పార్టీలో మెగా ఫ్యామిలీకి చెందిన వారు ఒక్కరంటే ఒక్కరూ కూడా లేకపోవడం ఇపుడు పలు చర్చలకు దారితీస్తోంది. ఈ ఘటనతో మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నట్టు మరోసారి చాలా స్పష్టంగా ఋజువు అయింది.
ఇకపోతే, జులై 20న మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టిన రోజు. ఈ క్రమంలో లావణ్య త్రిపాఠి, నమ్రత శిరోద్కర్, తారక్ భార్య లక్ష్మి ప్రణతి పలువురు సెలబ్రిటీలు ఉపాసనకు బర్త్ డే విషెష్ చెప్పినప్పటికీ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి మాత్రం ఉపాసనకు బర్త్ డే విషెష్ చెప్పకపోవడం కొసమెరుపు. దాంతో మెగా,అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి అని ఇట్టే అర్ధం అయిపోతుంది.
ఇక సోషల్ మీడియాలో నిత్యం మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుంది. మెగా అభిమానులకు ఎప్పటికప్పుడు అల్లు ఫ్యాన్స్ సవాల్ విసురుతూ ఉంటారు. తారస్థాయిలో వీరి మధ్య అధిపత్యపోరు నడుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే, అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. ఆ వ్యవహారంతో అల్లు అర్జున్ పై మెగాభిమానులు చాలా దారుణంగా విమర్శలు గుప్పించిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన పుట్టిన రోజు వేడుకలు ఇరు కుటుంబాల మధ్య గల వైరాన్ని తెలియజేస్తున్నాయ్ అంటూ కొంతమంది విమర్శకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: