దేవ‌ర విష‌యంలో మ‌హేష్‌బాబు సైలెన్స్ ఎందుకు.. ఏం జ‌రిగింది..!

Amruth kumar
దేవ‌ర విష‌యంలో మ‌హేష్‌బాబు సైలెన్స్ ఎందుకు.. ఏం జ‌రిగింది..!
టాలీవుడ్ స్టార్ హీరోల కొత్త సినిమాలు రిలీజ్ అయితే ఆ సినిమాలకు మంచి టాక్ వస్తే దర్శకధీరుడు రాజమౌళితో మొదలుపెట్టి చాలామంది స్టార్ హీరోలు .. మిడిల్ రేంజ్ హీరోలు వరిసె పెట్టి ఆ హీరోలను ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. సాయి ధరంతేజ్ - రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి వాళ్ళు సినిమా రేంజ్ తో సంబంధం లేకుండా చిన్న చిన్న హీరోల సినిమాలు కూడా వాళ్లకి నచ్చితే ఎంకరేజ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు. మహేష్ బాబు అయితే ఎవరు అడగకుండానే తన మనసుకు నచ్చితే ఎన్నో చిన్న సినిమాల టీజర్లు.. ట్రైలర్లు సినిమాలను చూసి సోషల్ మీడియాలో ఆ సినిమాలను ఎంకరేజ్ చేస్తూ పోస్టులు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతుంది. దేవర సినిమా విజయాన్ని టోటల్ టాలీవుడ్ ప్రముఖులు.. టాలీవుడ్ సినీ అభిమానులు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంత ఎందుకు ... మహేష్ బాబు ఈనెల ప్రారంభంలో రిలీజ్ అయిన మత్తు వదలరా 2 విషయంలో తన రివ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దేవర సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న మహేష్ బాబు స్పందించకపోవడం ఏంటన్న ? చర్చ తెరమీదకు వచ్చింది. దేవర బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే రు. 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సునామి క్రియేట్ చేసింది. ఈ విషయంలో మహేష్ ఎప్పటి వరకు స్పందించలేదు.

కనీసం దేవర సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా డైరెక్టర్ కొరటాల శివ మహేష్ బాబుతో గతంలో శ్రీమంతుడు - భరత్ అనే నేను రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. అటు కొరటాల శివతో ఉన్న సాన్నిహిత్యంతో పాటు ఇటు ఎన్టీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం నేప‌థ్యంలో దేవర రిలీజ్ కి ముందు శుభాకాంక్షలు చెప్పలేదు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక కూడా స్పందించలేదు. మహేష్ సినిమా చూశాక స్పందిస్తారా లేదా అన్నది తెలియాలి. ప్రస్తుతానికైతే మహేష్ బాబు విదేశాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: