వారిని వదలని పూనమ్ కౌర్.. మరో సంచలన ట్విట్..!

Divya
గత కొన్ని వారాలుగా ఆంధ్రప్రదేశ్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పైన సుప్రీంకోర్టు కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.. ముఖ్యంగా ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారనే విధంగా కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేసినప్పటికీ అందుకు తగ్గట్టుగా ఆధారాలు ఉన్నాయా దేవుళ్లను రాజకీయం చేయొద్దంటూ సుప్రీంకోర్టు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించింది.. అసలు ఆధారాలే లేకుండా సిట్ విచారణ పూర్తికాకుండానే ఎందుకు మీరు మీడియా ముందుకు వచ్చి మరి ఇలాంటి విషయాలను తెలిపారు అంటూ ఏపీ సర్కార్ పైన హైకోర్టు ఫైర్ అయ్యింది.

దీంతో ఒక్కసారిగా ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మారిపోతోంది అంటూ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఇలా ఫైర్ కావడంతో ఏపీ ప్రభుత్వం కూడా సైలెంట్ గా మారింది.. మొన్నటి వరకు సనాతన ధర్మం అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏవేవో చేస్తూ ఉన్నారు.నిన్నటి రోజున తిరుపతి మెట్లు కాలినడకన వెళ్లడం జరిగింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పైన సీఎం చంద్రబాబు పైన చాలామంది పెదవి విరుస్తూ సెటైరికల్ గా పోస్ట్లు షేర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పూనమ్ కౌర్ కౌరు కూడా గత కొద్దిరోజులుగా పలు రకాల సెటైరికల్ పోస్టులను షేర్ చేస్తూనే ఉంది.

పూనమ్ కౌర్ తాజాగా వెంకటేశ్వర స్వామి ఫోటో వద్ద నిలబడి దండం పెట్టుతూ ఉన్నట్టుగా ఒక ఫోటోని షేర్ చేస్తూ గోవిందా అనే ఒక క్యాప్షన్ ని రాసుకురావడం జరిగింది.. అయితే పూనమ్ ఇది కేవలం భక్తితో పెట్టిన ఫోటోల కనిపించడం లేదు తిరుపతి లడ్డు వివాదంలో పవన్ కళ్యాణ్ కు కౌంటర్ వేసినట్టుగా కనిపిస్తోంది అంటూ పలువురు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ని పరోక్షంగా ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ పని గోవిందా అంటూ సెటైర్లు వేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ట్విట్ కూడా వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: