నా కోడల్ని ఎవరి బెడ్ రూమ్ కి పంపలేదు.. కొండా సురేఖ పై నాగార్జున ఫైర్..?

Pandrala Sravanthi
కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సోషల్ మీడియా మొత్తం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలే వైరల్ గా మారాయి. ఇంతకీ కొండా సురేఖ ఏం మాట్లాడిందంటే..హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేస్తూ వారి జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నాడు. చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీ వదిలి పారిపోవడానికి కారణం కేటీఆర్.ఎంతో మంది హీరోయిన్ల జీవితాలు బలి తీసుకున్నాడు. ఇక గతంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కి నోటీసులు ఇచ్చారు. కానీ ఆ సమయంలో సమంతని తన దగ్గరికి పంపించాలి అని నాగార్జునకి కేటీఆర్ కండిషన్ పెట్టారు. ఒకవేళ తన దగ్గరికి సమంతని పంపిస్తే మీ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేయనని హామీ ఇచ్చారు.అయితే ఇదే విషయాన్ని కొడుకు నాగచైతన్యతో చెప్పి పంపించమని అడిగారు నాగ్.దీంతో తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి సమంతని నువ్వు కేటీఆర్ దగ్గరికి వెళ్ళాలి అని అడగగా.. నేను ఆ పనికి ఒప్పుకోను అంటూ సమంత వారిపై కోప్పడింది. 

అయినా కూడా విడిచిపెట్టకుండా తండ్రి కొడుకులు పట్టు పట్టి టార్చర్ చేశారు. దాంతో ఆ పని చేయలేక సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చి దూరంగా వెళ్లిపోయింది.ఇక ఈ విషయంలో ఉన్న నిజాన్ని సమంత బయటికి వచ్చి చెప్పాలి ఆమె నోరు మెదపాలి.. అంటూ కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.ఇక కొండా సురేఖ వ్యాఖ్యలపై ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ నాయకులతో పాటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా మండిపడుతున్నారు.. అయితే తాజాగా ఈ విషయంలో నాగార్జున స్పందించి కొండా సురేఖ పై ఫైర్ అయ్యారు. కొండా సురేఖ మాట్లాడిన మాటలు అన్ని పూర్తిగా అవాస్తవం. 

ఒకరి వ్యక్తిగత విషయాలు మాట్లాడేటప్పుడు అందులో ఎంత నిజం ఉంది అని తెలుసుకొని మాట్లాడాలి. బాధ్యత గల పదవిలో ఉన్నారు ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడకండి.మీ ప్రత్యర్థులను విమర్శించడం కోసం సినిమా వారిని వాడుకోవడం ఏమాత్రం బాలేదు. మా కుటుంబం పై మీరు చేసిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. దీనిపై మీరు వెంటనే స్పందించి ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాను అంటూ నాగార్జున కొండా సురేఖ పై మండిపడ్డారు. మరి నాగార్జున వ్యాఖ్యలపై కొండా సురేఖ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: