ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పిన నిర్మాత.. ఏం జరిగిందంటే..?

Divya
గత నెల 27వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో  ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన దేవర చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా బాగానే రాబట్టినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలైన 6వ రోజుకు 396 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే దేవర చిత్రానికి తెలుగులో ఒక్క ప్రమోషన్స్ ఈవెంట్ కూడా ఎక్కడ చేయలేదు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్రమైన స్థాయిలో నిరాశతో ఉన్నారు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగానే ప్లాన్ చేసినప్పటికీ అభిమానుల సంఖ్య ఎక్కువగా రావడంతో క్యాన్సిల్ కావడం జరిగింది

ఇది అభిమానులకు మరింత నిరాశన కలిగించిందని చెప్పవచ్చు. దీంతో దేవర సినిమా విడుదలైన తర్వాత సక్సెస్ మీట్ ను భారీగా పెడతారు అనుకున్నారు కానీ చిత్ర యూనిట్ మాత్రం సక్సెస్ మీట్ని నిర్వహిస్తామని చెప్పిన ఇప్పుడు అది కూడా లేదనే విధంగా నిర్మాత నాగ వంశీ తన ట్విట్టర్ నుంచి వెల్లడించారు. దేవర సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించినందుకు అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అంటూ తెలిపారు.. దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో తారక్ అన్న దేవర సక్సెస్ మీట్ని సైతం ప్లాన్ చేసి అభిమానులను మీట్ కావాలనుకున్నారు..

ఇందుకు సంబంధించి మేము చాలానే ట్రై చేసాము కానీ దసరా ,దేవి నవరాత్రుల వేడుకలు అవ్వడం చేత అవుట్ డోర్ పర్మిషన్ రెండు తెలుగు రాష్ట్రాలనుంచి ఇవ్వలేదని పరిస్థితులు మా చేతులలో ఇప్పుడేమీ లేవు అందుకే అభిమానులకు ప్రేక్షకులకు మేము క్షమాపణలు చెబుతున్నామంటూ నిర్మాత నాగ వంశీ తెలియజేశారు. అయినప్పటికీ కూడా సక్సెస్ మీట్ పెట్టడానికి తాము ప్రయత్నిస్తూనే ఉంటామంటూ వెల్లడించారు. అభిమానులు మాత్రం కచ్చితంగా ఎన్టీఆర్ దేవర సక్సెస్ మీట్ని జరిపించాలని తమ అభిమానులతో మాట్లాడించేలా చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: