మహేష్ - రాజమౌళి మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. జక్కన్న ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

Amruth kumar
పాన్ ఇండియా లెవెల్ లో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా మూవీ SSMB29 .. త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా.. మహేష్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తి చూపిస్తున్నాడు. అయితే ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుంది.. ప్రేక్షకులు ముందుకు ఎప్పుడు వస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా గురించి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్టు తెలుస్తుంది.
ఈ సినిమాకు సంబంధించిన టీం ఇప్పటికే ఈ పనులను ప్రారంభించిందట. అలాగే ఈ సినిమాకి పనిచేయడానికి కీలక సిబ్బందికి కూడా శిక్షణ కూడా అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం వారు ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే ఈ మూవీ వచ్చే సంవత్సరం సెట్స్ పైకి వేలునున్నట్లు తెలుస్తుంది. అలాగే 2027 చివరిలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని కూడా అంటున్నారు. ఇక ఈ సినిమాను రాజమౌళి హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించబోతున్నాడు.
అలాగే పలువురు హాలీవుడ్ రేంజ్ టెక్నీషియన్స్, నటులు కూడా ఈ సినిమా కోసం పని చేయబోతున్నారు. అలాగే మహేష్ కు జంటగా ఈ సినిమాలో ఎవరు ఊహించని నటి నటించబోతుందని కూడా అంటున్నారు. ఇక రాజ‌మౌళి ఈ  సినిమా కోసం మ‌హేష్ ను కొత్త లుక్‌లో మేకోవ‌ర్ కానున్నాడు. అందుకే ఈ సినిమా పూర్త‌య్యే వ‌ర‌కు మ‌హేష్ బాబు ఎక్క‌డా క‌న‌బ‌డ‌కుండా ఉండాల‌ని జ‌క్క‌న్న కండిష‌న్ పెట్టాడ‌ట‌. ఈ లోపు మ‌హేష్ బాబు త‌న చేతిలో ఉన్న కొన్ని బాండ్ ఎండార్స్‌మెంట్స్ షూటింగ్ చేయ‌నున్నాడు.
ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఓ ముఖ్య‌పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ముందుగా ఈ పాత్ర కోసం విక్ర‌మ్ లేదా బాల‌య్యల‌ను అనుకున్నారు. ఫైన‌ల్‌గా నాగార్జున న‌టించడం దాదాపు ఖాయం అని చెప్పాలి.ఈ మూవీ తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవబోతుందని అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలుగు సినిమా ను ప్రపంచానికి మరోసారి తన ప్రమాణాలను ప్రదర్శించబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మరి ఈ సినిమాతో రాజమౌళి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: