పెళ్లైన హీరోతో పూజా హెగ్డే ఎఫైర్‌ ?

Veldandi Saikiran
పూజా హెగ్డే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. గత నాలుగేళ్ల క్రితం వరకు స్టార్ హీరోయిన్గా రాణించింది. ఈ బ్యూటీ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ కు సైతం ఎంట్రీ ఇచ్చి సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. గత రెండు, మూడు ఏళ్ల నుంచి పూజ హెగ్డే సినిమాలు వరుసగా ఫ్లాఫ్స్ అవడంతో తన కెరీర్ డీలపడింది. సినిమా ఆఫర్లు లేకపోవడంతో ఈ బ్యూటీ వెకేషన్ ట్రిప్ లను ఎంజాయ్ చేస్తోంది. పూజా హెగ్డే కర్ణాటకలోని ఉడిపి ప్రాంతానికి చెందిన అమ్మాయి. మోడలింగ్ పై ఆసక్తితో 2009, 2010లో మిస్ ఇండియా కాంపిటీషన్ లో పాల్గొంది.

2012లో కోలీవుడ్ లో జీవ హీరోగా నటించిన "మూగామూడి'' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ పూజ హెగ్డేకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశం ఇచ్చారు. 2014లో నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం, వరుణ్ తేజ్ సినిమా ముకుందాలో నటించింది. ఈ సినిమాలు మంచి హిట్ అవడంతో అనంతరం 2015లో అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమాలో నటించింది. ఈ సినిమాతో కంబ్యాక్ అందుకుంది. రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి వంటి స్పెషల్ సాంగ్ లో కనిపించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. అరవింద సమేత, వీర రాఘవ, గద్దల కొండ గణేష్, మహర్షి వంటి సినిమాలలో నటించింది.

ఈ సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి  2020లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన అల వైకుంఠపురం సినిమా పూజ హెగ్డే కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాతో పూజా హెగ్డే ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా నిలిచింది. అయితే ఆ సినిమా అనంతరం మళ్లీ పూజను వరస ఫ్లాప్లు ఇబ్బంది పెట్టాయి. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం పూజ హెగ్డే కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమిళ్ హీరో విజయ్ తో పూజాకు ఏఫైర్ ఉందని ఉమైర్ సంధు సంచలన పోస్ట్ చేశాడు. 'బీస్ట్' సినిమాలో విజయ్, పూజ హెగ్డే కలిసి నటించారు. అయితే ఆ సినిమా సమయం నుంచి వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని ఆరోపణలు చేశాడు. ఈ వార్తలపై ఎవరో ఒకరు స్పందిస్తే కానీ అసలు విషయం తెలియదు



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: