ఖరీదైన ఫ్లాప్.. ముగ్గురు స్టార్ లు.. 300కోట్ల బడ్జెట్.. అయినా?

praveen
సాదరణంగా ఒక సినిమాలో ఒక స్టార్ హీరో కాదు ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు అంటే ఆ మూవీపై అంచనాలు ఏ రేంజ్ లో పెరిగిపోతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇలా క్రేజీ కాంబినేషన్ రిపీట్ అయితే ఇక నిర్మాతలు కూడా ఎంత బడ్జెట్ పెట్టడానికైనా సిద్ధం అయిపోతూ ఉంటారు. అయితే ఇద్దరు స్టార్ హీరోలు ఉంటారు కాబట్టి ఇక ఇద్దరి అభిమానులు కూడా సినిమా చూడడానికి వస్తారు. కాబట్టి కాస్త యావరేజ్ టాక్ వచ్చిన సినిమాకు రావాల్సిన వసూళ్లు వచ్చేస్తూ ఉంటాయి.

 దీంతో ఇలా మల్టీస్టారర్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ మూవీ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. ఒక్కరు కాదు ఇద్దరు  స్టార్ హీరోలు కలిసి నటించారు. ఏకంగా 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది  ఇక భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ఇండస్ట్రీ రికార్డులను ఈ సినిమా తిరగరాయడం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ చివరికి ఇది అట్టర్ ఫ్లాప్ గా మారిపోయింది. నిర్మాతలకు రక్తపు కన్నీళ్లు వచ్చేలా చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన ఫ్లాప్ గా నిలిచింది.

 ఆ సినిమా మరేదో కాదు అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన థ
గ్స్ ఆఫ్ హిందుస్థాన్  ఈ సినిమాలో అమీర్ ఖాన్ తో పాటు కత్రినా కైఫ్, అమితాబచ్చన్ లాంటి ముగ్గురు స్టార్లు నటించారు. 2018లో విడుదలైన ఖరీదైన చిత్రంగా నిలిచింది. ఇదే దాదాపు 310 కోట్ల బడ్జెట్ తెరకెక్కింది . సినిమాలో విఎఫ్ ఎక్స్ విరివిగా ఉపయోగించారు. అయితే వీటి కారణంగానే బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోయింది. ఇక భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. అయితే బలహీనమైన కథ ఇక ఈ సినిమాలోని నటీనటుల యాక్షన్ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద పూర్తిగా బొక్క బోర్లా పడింది. ఇక ఫుల్ రన్ లో 1501.19 కోట్లు వసూలు చేసింది. దీంతో నిర్మాతలకు భారీగా నష్టాలు మిగిలాయ్. దీంతో ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఖరీదైన ఫ్లాప్ గా అప్పట్లో ఈ సినిమా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: