ఆ బ్లాక్ బస్టర్ మూవీని ప్రభాస్ మొదట రిజెక్ట్ చేశాడు అనే విషయం తెలుసా.. చివరకు జరిగింది అదే..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరియర్లో ఇప్పటివరకు ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ప్రభాస్ కెరియర్లో అద్భుతమైన విజయం సాధించిన సినిమాలలో మిస్టర్ ఫర్ఫెక్ట్ మూవీ ఒకటి. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , తాప్సి హీరోయిన్లుగా నటించగా ... దశరథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. విశ్వనాథ్ , బ్రహ్మానందం , ప్రకాష్ రాజ్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.

ఇకపోతే అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమా కథను మొదట విన్నప్పుడు ప్రభాస్ కి పెద్దగా నచ్చలేదట. దానితో ఈ సినిమాను చేయద్దు అనుకున్నాడట. మరి ఆ తర్వాత ఎందుకు ఈ సినిమా చేశాడు అనే వివరాలను తెలుసుకుందాం. ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా మిస్టర్ ఫర్ఫెక్ట్ మూవీ నిర్మాత అయినటువంటి దిల్ రాజు మాట్లాడుతూ ... ప్రభాస్ కి మొదట ఈ మూవీ కథను వినిపించాను. కథ మొత్తం విన్న ప్రభాస్ కి ఈ సినిమా యొక్క మొదటి సగ భాగం బాగానే నచ్చింది కానీ రెండవ భాగం పెద్దగా నచ్చలేదు. అదే విషయాన్ని ఆయన చెప్పాడు. ఆ తర్వాత నేను కొంత తిమి ఇవ్వండి అన్నాను. కొంత కాలం తర్వాత ఆయనకు సెకండాఫ్ వినిపిస్తాను అని ఫోన్ చేశాను.

ఇక ఆయన మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా అస్సలు చేయొద్దు. కాకపోతే విని నచ్చలేదు అని చెప్పాలి అని ఉద్దేశంతో వచ్చాడట. ఇక కథ మొత్తం విన్న తర్వాత సూపర్ గా నచ్చడంతో చేస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత దిల్ రాజు తో ఈ సినిమా అస్సలు చేయొద్దు అని చెబుదామని వచ్చాను. కానీ సెకండ్ హాఫ్ మీరు చాలా బాగా డెవలప్ చేశారు. అందుకే ఈ సినిమా చేస్తాను అని అన్నాను అని ప్రభాస్ చెప్పినట్లు దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: