ఆ విషయంలో కృష్ణవంశీని బిట్ చేయడం కష్టమే.. వరుస పెట్టి అలాంటి పనులు..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు ను సంపాదించుకున్న దర్శకులలో కృష్ణ వంశీ ఒకరు. ఈయన ఈ మధ్య కాలంలో దర్శకత్వం వహించిన సినిమాలు భారీ స్థాయి విజయాలను అందుకోవడం లేదు. కానీ ఒకప్పుడు ఈయన దర్శకత్వం వహించిన అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే కృష్ణ వంశీ రెగ్యులర్ , రొటీన్ , కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలను కాకుండా వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కిస్తూ అద్భుతమైన విజయాలు అందుకున్నాడు.

దానితో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో క్రియేటివ్ దర్శకుడు అనే పేరు కూడా వచ్చింది. ఆఖరుగా ఈ దర్శకుడు రంగమార్తాండ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో వరస పెట్టి కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొంది అద్భుతమైన విజయం అందుకున్న సినిమాలు రీ రిలీజ్ అవుతూ వస్తున్నాయి.

కొన్ని రోజుల క్రితమే మహేష్ బాబు హీరోగా కృష్ణ వంశీ తెరకెక్కించిన మురారి మూవీ ని రీ రిలీస్ చేయగా ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇకపోతే కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొంది బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఖడ్గం మూవీ ని కూడా మరికొన్ని రోజుల్లో రీ రిలీస్ చేయబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా రీ రిలీస్ కోసం కృష్ణ వంశీ ప్రచారాలను కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈయన ఒక ప్రెస్ మీట్ ను కూడా మరికొన్ని రోజుల్లోనే నిర్వహించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ , రవితేజ , ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ మూవీలోని వీరి నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు వీరికి దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kv

సంబంధిత వార్తలు: