ఓజి పై పడిన దేవర ఎఫెక్ట్.. ఆ విషయంలో పెద్ద మార్పు చేయనున్న మేకర్స్..?

Pulgam Srinivas
కొన్ని రోజుల క్రితమే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర మొదటి భాగం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 27 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 130 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 130 కోట్ల షేర్ కలెక్షన్లను రాబడుతుందా లేదా అని అనుమానాలు కూడా కొంత మంది లో వ్యక్తం అయ్యాయి.

కానీ ఈ సినిమా ఇప్పటికే 130 కోట్లకు మించిన షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసి అద్భుతమైన లాభాలను కూడా అందుకుంటుంది. ఇలా ఈ మూవీ కి మిక్స్ డ్ టాక్ తోనే భారీ కలెక్షన్లు రావడంతో ఓజి మూవీ యూనిట్ ఓ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓజి మూవీ కి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను కొంత కాలం క్రితం కేవలం 120 కోట్లకు మాత్రమే ఆమె వేద్దాం అని మూవీ యూనిట్ అనుకుందట.

ఇక దేవర మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్లు వస్తూ ఉండడంతో ఈ మూవీ బృందం ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులకి 150 కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఓజి మూవీ లో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ ఉండగా ... ప్రియాంక అరుల్ మోహన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. సుజిత్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: